బిస్కెట్లు కొందామని వెళుతుండగా... | boy died in tipper accident | Sakshi
Sakshi News home page

బిస్కెట్లు కొందామని వెళుతుండగా...

Jan 17 2018 10:23 AM | Updated on Jul 12 2019 3:02 PM

boy died in tipper accident - Sakshi

సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: భ​ద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. పండక్కు వచ్చిన మనవడికి బిస్కెట్లు కొనేందుకు దుకాణానికి వెళుతుండగా బొగ్గు లోడుతో వెళుతున్న టిప్పర్‌ లారీ ఢీకొట్టింది. ఈ సంఘటనలో జగదీష్‌(10) అనే బాలుడు అక్కడికక్కడే మతిచెందగా బాలుడి తాత గాంధీరెడ్డి తీవ్రంగా గాయపడ్డారు.

గాంధీరెడ్డి ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. మనవడు బిస్కెట్‌ కావాలనడంతో గాంధీరెడ్డి మనవడిని తోడ్కొని అంగడికి వెళుతుండగా ఈ ఘోరం జరిగింది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు ఆగ్రహంతో టిప్పర్‌ను ధ్వంసంచేయడమేకాక రోడ్డుపై బైటాయించి ఆందోళన చేశారు. జనాన్ని చూసిన డ్రైవర్‌ పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement