వివాహితపై యాసిడ్ దాడి కలకలం | Acid attack on woman in Warangal district | Sakshi
Sakshi News home page

వరంగల్ లో వివాహితపై యాసిడ్ దాడి

Nov 29 2017 7:24 PM | Updated on Aug 17 2018 2:10 PM

Acid attack on woman in Warangal district - Sakshi

సాక్షి, వరంగల్‌ : వివాహితపై యాసిడ్ దాడి ఘటన స్థానికంగా కలకలం రేపింది. జనగామ జిల్లా జఫర్ ఘడ్ సమీపంలోని గరిమిల్లపల్లి వద్ద ...ఆమెను కొంతమంది యువకులు చేతులు, కాళ్లు కట్టివేసి యాసిడ్‌ దాడికి పాల్పడ్డారు. తీవ్రంగా గాయపడిన ఆమె అరుపులు విన్న బాటసారులు వెంటనే పోలీసులకు సమాచారం అందించి ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో న్యాయమూర్తి వాగ్మూలం తీసుకొన్నారు.

కాగా వరంగల్‌లోని కొత్తవాడ ప్రాంతానికి చెందిన మాధురి కొద్దిరోజులుగా భర్త చందుకు దూరంగా ఉంటూ పుట్టింట్లోనే ఉంటోంది. ఆమెకు ఒక కొడుకు కూడా ఉన్నాడు. కొద్ది రోజుల క్రితం చంటి అనే వ్యక్తితో మాధురికి మళ్లీపెళ్లి అయినట్లు తెలుస్తోంది. ఇటీవల అతనితో కూడా గొడవపడినట్లు తెలుస్తోంది. అసలు మాధవి ఆ గ్రామానికి ఎందుకు వెళ్లింది? ఎలా వెళ్లింది? దాడి ఎవరు, ఎందుకు చేశారు? అనే విషయాలపై పోలీసులు దృష్టి పెట్టారు. ఈ ఘటన జిల్లాలో కలకలం రేపుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement