రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం | 9 People Died Several Injured In Rajasthan Road Accident | Sakshi
Sakshi News home page

రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం; 9 మంది మృతి

Feb 11 2020 12:48 PM | Updated on Feb 11 2020 1:15 PM

9 People Died Several Injured In Rajasthan Road Accident - Sakshi

జైపూర్‌ : రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. భిల్వారా జిల్లాలోని బిగోడ్‌ ప్రాంతంలో సోమవారం రాత్రి జరిగిన ఈ ప్రమాదంలో తొమ్మిది మంది మరణించగా పదిహేను మందికి తీవ్ర గాయాలయ్యాయి. భిల్వారా నుంచి కోటా జిల్లాకు వెళ్తున్న పెళ్లి బృందం బస్సు మార్గ మాధ్యలో కారును ఢీ కొట్టడంతో ఈ ఘటన సంభవించింది. మృతుల్లో ఐదుగురు పురుషులు, ముగ్గురు మహిళలు, ఒక చిన్నారి ఉన్నట్లు తెలుస్తోంది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను బిల్వారాలోని మహాత్మాగాంధీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా ఈ ప్రమాద ఘటనపై రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌ స్పందించారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను సీఎం గెహ్లాట్‌ ఆదేశిస్తూ ట్వీట్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement