విజయనగరం రూరల్ : ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఈఎస్ టాస్క్ఫోర్స్ విభాగం సీఐ చక్రవర్తి ఆధ్వర్యంలో సిబ్బంది విజయనగరం ఎక్సైజ్ స్టేషన్–1 పరిధి శాంతినగర్లోని బెల్ట్షాపుపై ఆదివారం దాడిచేసి 12 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా దుకాణం యజమాని గాజులరేగకు చెందిన కర్రి శంకరరావును అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేవారు. దాడుల్లో ఎక్సైజ్ ఈఎస్ టాస్క్ఫోర్స్ హెచ్సీ ఎం.రామారావు, కానిస్టేబుళ్లు బాషా, లోకాభిరాం, శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.
12 మద్యం సీసాలు స్వాధీనం
Apr 9 2018 2:16 PM | Updated on Oct 9 2018 5:39 PM
Advertisement
Advertisement