
సాక్షి, న్యూఢిల్లీ : టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం పైకి ఎగబాకిగింది. కూరగాయలు, ఇంధన ధరలు బాగా పెరగడంతో ఫిబ్రవరి నెలలోని డబ్ల్యూపీఐ ఇన్ప్లేషన 2.93 శాతంగా నమోదైంది. ఈ గణాంకాలను ప్రభుత్వం గురువారం విడుదల చేసింది.
గత జనవరిలో 2.76 శాతంతో 10 ఏళ్ల కనిష్టానికి చేరినా ఫిబ్రవరిలో అంతే వేగంగా ఎగిసింది. జనవరిలో 1.84 శాతంగా ఉన్న కూరగాయల ద్రవ్యోల్బణంతో పోలిస్తే ప్రస్తుతం 3.29( వార్షిక ప్రాతిపదికన)శాతానికి చేరింది.