వొడాఫోన్ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌

Vodafone Rs 69 New Plan Now Live, Offers Subscribers Free Minutes - Sakshi

రూ. 69 ప్లాన్‌ను లాంచ్ చేసిన వొడాఫోన్

సాక్షి, ముంబై:  టెలికాం సంస్థ వొడాఫోన్ తన ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం రూ.69 ల  ఒక కొత్త  ప్రీ పెయిడ్‌ ప్లాన్‌ను  తీసుకొచ్చింది. 28 రోజల వాలిడిటీ  ఉన్న ఈ ప్లాన్‌లో 150 నిమిషాల వాయిస్‌ కాల్స్, 250 ఎంబీ డేటా ప్రయోజనాలను వినియోగదారులకు అందిస్తోంది.  అలాగే పలు సర్కిల్స్‌లో ఈ ప్లాన్‌లో ఎస్‌ఎంఎస్‌లు కూడా ఉచితం.  ప్రస్తుతం ఏపీ, తెలంగాణ, అస్సాం, బీహార్, జార్ఖండ్, ఢిల్లీ, ముంబై ప్రాంతాల్లో మాత్రమే ఈ ప్లాన్ వినియోగదారులకు అందుబాటులో ఉంది.  తన ఆల్ రౌండర్ ప్రీ పెయిడ్ ప్లాన్లలో  ఈ కొత్త ప్లాన్‌ను ప్రవేశపెట్టింది.  తన పోర్ట్‌ఫోలియోలోఇప్పటికే లాంచ్‌ చేసిన  రూ .45 , 35, 65, 95, రూ .145 ప్లాన్లకు కొనసాగింపుగా దీన్ని తీసుకొచ్చింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top