టీవీలు, ఫ్రిజ్‌లు, ఏసీల ధరలు దిగొస్తాయ్! | tv fridge and ac prices stepping down | Sakshi
Sakshi News home page

టీవీలు, ఫ్రిజ్‌లు, ఏసీల ధరలు దిగొస్తాయ్!

Feb 18 2014 1:19 AM | Updated on Sep 2 2017 3:48 AM

టీవీలు, ఫ్రిజ్‌లు, ఏసీల ధరలు దిగొస్తాయ్!

టీవీలు, ఫ్రిజ్‌లు, ఏసీల ధరలు దిగొస్తాయ్!

ఫ్రిజ్‌లు, టీవీలు, ఏసీలు ఇతరత్రా కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ వస్తువుల ధరలుదిగొచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. కన్జూమర్ గూడ్స్‌పై ఎక్సైజ్ సుంకాన్ని 12 శాతం నుంచి 10 శాతానికి తగ్గిస్తామని ఆర్థిక మంత్రి పి. చిదంబరం మధ్యంతర బడ్జెట్‌లో ప్రతిపాదించడంతో ఈ రంగంలోని కంపెనీలు స్పందించాయి.

 రేట్ల తగ్గింపు పరిశీలిస్తున్నాం: ఎల్‌జీ, ప్యానాసోనిక్
 న్యూఢిల్లీ: ఫ్రిజ్‌లు, టీవీలు, ఏసీలు ఇతరత్రా కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ వస్తువుల ధరలుదిగొచ్చే అవకాశాలు కనబడుతున్నాయి.  కన్జూమర్ గూడ్స్‌పై ఎక్సైజ్ సుంకాన్ని 12 శాతం నుంచి 10 శాతానికి తగ్గిస్తామని ఆర్థిక మంత్రి పి. చిదంబరం మధ్యంతర బడ్జెట్‌లో ప్రతిపాదించడంతో ఈ రంగంలోని కంపెనీలు స్పందించాయి. ధరలు తగ్గించే విషయమై ప్యానాసానిక్ ఇండియా, ఎల్‌జీ ఇండియా కంపెనీలు కసరత్తు చేస్తున్నాయి. ఈ తగ్గింపు ప్రభావాన్ని మదింపు చేస్తున్నామని వెల్లడించాయి. మార్కెట్ పరిస్థితులు, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుని ధరలపై నిర్ణయం తీసుకుంటామని ఎల్‌జీ ఇండియా ఎండీ  సూన్ క్వాన్ పేర్కొన్నారు. ఈ బడ్జెట్ సానుకూలంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు.
 
  మార్కెట్ పరిస్థితులను ఈ బడ్జెట్ మెరుగుపరుస్తుందని, తయారీ రంగానికి ఊపునిస్తుందని ఆయన చెప్పారు. వినియోగదారుల సెంటిమెంట్ సానుకూలంగా మారుస్తుందని, కొత్త వస్తువుల కొనుగోళ్లకు ప్రోత్సాహాన్నిస్తుందని పేర్కొన్నారు. 2 శాతం ఎక్సైజ్ సుంకం తగ్గింపు అనేది ధరలపై పెద్దగా ప్రభావం చూపనప్పటికీ, ఇది ఆహ్వానించదగ్గ చర్య అని ప్యానాసానిక్ ఇండియా ఎండీ మనీష్ శర్మ చెప్పారు.
 
 
 
 

Advertisement
 
Advertisement
Advertisement