స్థిరంగా పుత్తడి ధర

today gold price - Sakshi

శుక్రవారం పసిడి ధర దాదాపు స్థిరంగా ట్రేడ్‌ అవుతోంది. ఉదయం 10:20 గంటల ప్రాంతంలో దేశీయ మల్టీ కమోడిటీ మార్కెట్లో నిన్నటితో పోలిస్తే కేవలం రూ.4 రూపాయలు మాత్రమే పెరిగి 10 గ్రాముల పసిడి రూ.46,555 వద్ద ట్రేడ్‌ అవుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర స్వల్పంగా పెరిగింది. నిన్నటితో పోలిస్తే 6 డాలర్లు పెరిగి ఔన్స్‌ బంగారం 1,719.10 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. అంతర్జాతీయంగా ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో ఇన్వెస్టర్లు బంగారంపై పెట్టుబడులు పెడుతుండడం వల్లే పుత్తడి ధరలు పెరుగుతున్నాయని మార్కెట్‌ నిపుణులు అంచనావేస్తున్నారు.

Related Tweets
Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top