మార్కెట్లోకి సుజుకీ వి-స్ట్రామ్‌ 650 ఎక్స్‌టి (2019)

Suzuki Motorcycle launches new edition of V-Strom 650XT - Sakshi

ధర రూ.7.46 లక్షలు (ఎక్స్‌షోరూం, ఢిల్లీ)

సాక్షి, న్యూఢిల్లీ:  సుజుకీ మోటార్‌సైకిల్‌ ఇండియా కొత్త ప్రీమియం మోటార్‌ బైక్‌ మోడల్‌ను లాంచ్‌ చేసింది. అడ్వెంచర్‌ టూరర్‌ బైక్‌ వి-స్ట్రామ్‌ 650ఎక్స్‌టి ఏబీఎస్‌(2019) ను సోమవారం మార్కెట్లోకి విడుదల చేసింది. రెండు రంగుల్లో లభించనున్న ఈ బైక్‌ ధర రూ.7.46 లక్షలు (ఢిల్లీ ఎక్స్‌షోరూమ్‌).  

కొత్త గ్రాఫిక్స్‌, అదనపు ఫీచర్లతో  వి-స్ట్రామ్‌ కొత్త వెర్షన్‌ భారతీయ వినియోగదారులకు అద్భుతమైన అడ్వెంచర్‌ అనుభూతిని అందిస్తుందని సుజుకీ మోటార్‌సైకిల్‌ ఇండియా ఎండీ సతోషి ఉచిడా వెల్లడించారు. గత ఏడాది లాంచ్‌ చేసిన ఈ వి- స్ట్రామ్‌ మోటార్‌  సైకిల్‌కు  మంచి ఆదరణ లభించిందనీ, ఇపుడు  కూడా అదే స్పందన లభిస్తుందని తాము ఆశిస్తున్నామన్నారు. లైట్‌ వెయిట్‌ యాంటీ లాక్‌ బ్రేక్‌ సిస్టమ్‌.. రహదారిపై పట్టును కోల్పోకుండా చేస్తుందని పేర్కొన్నారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top