క్రీడా స్పాన్సర్‌షిప్‌ జోరు 

Sports sponsorship initiative - Sakshi

2017లో రూ.7,300 కోట్ల ఖర్చు 

ముంబై: దేశంలో క్రీడల స్పాన్సర్‌షిప్‌ మార్కెట్‌ వేగంగా విస్తరిస్తోంది. 2017లో స్పాన్సర్‌షిప్‌ రూపంలో రూ.7,300 కోట్ల నిధుల వ్యయం జరిగింది. 2016లో రూ.6,400 కోట్ల కంటే 14 శాతం ఎక్కువ. 55 శాతంతో మీడియా పెట్టుబడులే ఇందులో సింహ బాగంగా ఉన్నాయి. ఆ తర్వాత క్రీడా మైదానాల స్పాన్సర్‌షిప్‌లు, ఈఎస్‌పీ ప్రాపర్టీలు ఉన్నట్టు స్పోర్ట్‌›్జపవర్‌ అనే సంస్థ ఓ నివేదికలో తెలియజేసింది.

క్రీడలపై మీడియా ఖర్చు గతేడాదిలో 15.8 శాతం వృద్ధితో 3,511 కోట్ల నుంచి రూ.4,065 కోట్లకు పెరిగాయి. ఇందులో టెలివిజన్‌ పాత్ర కీలకమని ఈ నివేదిక పేర్కొంది.    

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top