ఎన్ఎండీసీ సీఎండీ నరేంద్ర కొఠారి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మైనింగ్ సంస్థలు స్థల సమీకరణ, అటవీ, పర్యావరణ అనుమతుల వంటి సవాళ్లు ఎదుర్కొంటున్నాయని మైనింగ్ దిగ్గజం ఎన్ఎండీసీ సీఎండీ నరేంద్ర కొఠారి చెప్పారు. ప్రస్తుతం ఒక్కొక్క విభాగం నుంచి ఒక్కో అనుమతి తీసుకోవాల్సి వస్తున్నందున, ఈ ప్రక్రియలో తీవ్ర జాప్యం జరుగుతోందన్నారు. ఈ నేపథ్యంలో ప్రాజెక్టుల అనుమతులను వేగవంతం చేసే దిశగా సింగిల్ విండో విధానం అవసరమని తెలిపారు. ఇటు వృద్ధి, అటు పర్యావరణ పరిరక్షణ విధానాల మధ్య సమతౌల్యం పాటించే విధంగా కొత్త ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.
‘దేశ వృద్ధిలో మైనింగ్ కీలక పాత్ర’ అంశంపై శనివారం ఇక్కడ జరిగిన సెమినార్లో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు చెప్పారు. ఎన్ఎండీసీ ప్రస్తుత మైనింగ్ వార్షిక సామర్థ్యం 30 మిలియన్ టన్నులు ఉండగా.. దీన్ని 50 మిలియన్ టన్నులకు పెంచే దిశగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. మరోవైపు, ఉక్కు రంగంలో కార్యకలాపాల విస్తరణలో భాగంగా దాదాపు రూ. 15,000 కోట్ల పైచిలుకు ఇన్వెస్ట్మెంట్తో తలపెట్టిన స్టీల్ ప్లాంటు పనులు చురుగ్గా సాగుతున్నాయని వివరించారు. ఇక గనుల అప్గ్రెడేషన్ కోసం రూ.10,000 కోట్ల దాకా వెచ్చించనున్నట్లు ఆయన తెలిపారు.
విస్తరణపై దృష్టి: నైవేలీ లిగ్నైట్ సీఎండీ సురేంద్ర
12వ ప్రణాళిక కాలంలో (2012-2017) విస్తరణపై రూ. 29,000 కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నామని సెమినార్లో నైవేలీ లిగ్నైట్ సీఎండీ సురేంద్ర మోహన్ తెలిపారు. ఇందులో 30 శాతం సొంత నిధులు కాగా, మిగతాది రుణం రూపంలో సమకూర్చుకుంటున్నట్లు తెలిపారు.
ట్యుటికోరిన్లో తలపెట్టిన వెయ్యి మెగావాట్ల విద్యుత్ ప్లాంటు త్వరలో అందుబాటులోకి రాగలదని వివరించారు. బొగ్గు బ్లాకుల కొనుగోలు కోసం మొజాంబిక్, ఆస్ట్రేలియా తదితర దేశాల్లో కొన్నింటిని షార్ట్లిస్ట్ చేశామని, 2014-15 ఆఖరుకల్లా డీల్ పూర్తి కాగలదన్నారు. లిగ్నైట్లో తేమ శాతాన్ని తగ్గించి, నాణ్యతను పెంచే దిశగా అప్గ్రెడేషన్ కోసం జపాన్కి చెందిన కోబే స్టీల్తో త్వరలో అవగాహన ఒప్పందం కుదుర్చుకోబోతున్నామని తెలిపారు.
మైనింగ్కు సింగిల్ విండో విధానం కావాలి
Published Sun, Jun 15 2014 1:35 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మరో కుటుంబాన్ని ఆదుకున్న స్టార్ హీరో.. వీడియో వైరల్!
ఢిల్లీ బ్యాటర్లు ఊచ కోత.. రాజస్తాన్ ముందు భారీ టార్గెట్
రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నాము: కాంగ్రెస్ నేత పవన్ ఖేరా
బాహుబలి కేవలం 10 కోట్ల మంది మాత్రమే: రాజమౌళి కామెంట్స్
బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
తెలంగాణను అసమర్థులు ఏలుతున్నారు: కేసీఆర్
క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
నెల ముందే ప్రమోషన్.. ఇప్పుడు జాబ్ పోయింది: అగ్రరాజ్యంలో టెకీ ఆవేదన
జేక్ ఫ్రేజర్ విధ్వంసం.. కేవలం 19 బంతుల్లోనే! వీడియో వైరల్
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement