ఆర్డినెన్స్లపై ఆశాభావం
154 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
ముంబై: కేంద్రం ఆర్థిక సంస్కరణల కోసం పలు ఆర్డినెన్స్లను తీసుకురానున్నదన్న వార్తలతో సోమవారం స్టాక్ మార్కెట్లు లాభాల బాట పట్టాయి. క్రిస్మస్ సెలవుల సందర్భంగా లావాదేవీలు మందకొడిగా ఉన్నప్పటికీ, లోహ, వాహన రంగ షేర్లలో కొనుగోళ్ల కారణంగా బీఎస్ఈ సెన్సెక్స్ 154 పాయింట్లు పెరిగింది.
అంతర్జాతీయ సంకేతాలు పటిష్టంగా ఉండడం, విదేశీ ఫండ్ల కొనుగోళ్లు షురూ చేయడంతో వరుసగా రెండో సెషన్లోనూ సెన్సెక్స్ లాభాల బాటలోనే నడిచింది. గరిష్టంగా 27, 507 పాయింట్లకు ఎగసిన సెన్సెక్స్ చివరకు 154 పాయింట్ల లాభంతో 27,395.73 వద్ద ముగిసింది. మరో వైపు నిఫ్టీ 46 పాయింట్ల లాభంతో 8,246 వద్ద ముగిసింది.
బ్యాంకింగ్ సూచి మినహా మిగిలిన 11 రంగాల సూచీలు లాభాల్లోనే ముగిశాయి. ఈ నెల 9 నుంచి 12 రోజుల పాటు భారీగా అమ్మకాలు జరిపిన ఎఫ్పీఐ(ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్)లు గత శుక్రవారం రూ.39.9 కోట్ల విలువైన షేర్లు కొనుగోలు చేశారని స్టాక్మార్కెట్ డేటా వెల్లడిస్తోంది.
మధ్యాహ్నం తర్వాత లాభాల స్వీకరణ
భూ సేకరణ, మైనింగ్ ఇతర చట్టాల్లో ఆర్డినెన్స్ల రూపంలో కేంద్రం మార్పులు, చేర్పులు చేయనున్నదన్న వార్తలతో పలు మౌలిక రంగ, లోహ షేర్లు పెరిగాయి. హిందాల్కో, టాటా స్టీల్, జేఎస్డబ్ల్యూ స్టీల్, జిందాల్ స్టీల్ తదితర లోహ షేర్లు సెన్సెక్స్కు తగిన తోడ్పాటునందించాయి. డిసెంబర్ అమ్మకాల గణాంకాలు మరో రెండు రోజుల్లో వెల్లడి కానున్నందున వాహన షేర్లలో కొనుగోళ్ల జోరు పెరిగింది.
డాలర్తో రూపాయి మారకం విలువ క్షీణించడంతో ఫార్మా, ఐటీ షేర్లు పెరిగాయి. మధ్యాహ్నం తర్వాత లాభాల స్వీకరణ కారణంగా ప్రారంభ లాభాలు ఆవిరయ్యాయి. మార్కెట్ బ్రెడ్త్ పాజిటివ్గా ఉంది. శుక్రవారం రూ.1,962 కోట్లుగా ఉన్న మొత్తం మార్కెట్ టర్నోవర్ సోమవారం రూ.2,261 కోట్లకు పెరిగింది.
టాటా మోటార్స్, హెచ్డీఎఫ్సీ, ఆర్ఐఎల్, ఐటీసీ, టీసీఎస్, సెసా స్టెరిలైట్, సన్ ఫార్మా, హీరో మోటొకార్ప్, హిందాల్కో, హిందూస్తాన్ యూనిలివర్, కోల్ ఇండియా, టాటా స్టీల్ షేర్లు 4 శాతం నుంచి 1 శాతం రేంజ్లో పెరిగాయి. ఆసియా, యూరోప్ మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి. చైనా, హాంగ్కాంగ్, సింగపూర్, తైవాన్ సూచీలు 0.74 శాతం నుంచి 1.82 శాతం మధ్యలో పెరగ్గా, జపాన్, దక్షిన కొరియాలు సూచీలు 0.5 శాతం, 1.04 శాతం చొప్పున క్షీణించాయి.
లోహ షేర్లు మిలమిల
Published Tue, Dec 30 2014 12:37 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
ఆర్టీసీ బస్సు– బైక్ ఢీ ●
వీడిన మహిళ హత్య కేసు మిస్టరీ
అంబేడ్కర్ కళాశాలలో దొడ్డమణి గోల్మాల్
తప్పక చదవండి
- పండ్ల తోటలకు.. 'సన్ బర్న్' ముప్పు!
- షర్మిల.. ఎందుకిలా..!
- RRR రీ-రిలీజ్ ప్రకటన.. స్పెషల్ ఏంటో తెలుసా..?
- 34 ఏళ్లుగా బీజేపీకి కంచుకోట.. శేషన్, రాజేష్ ఖన్నా బలాదూర్!
- ఆగిన సునీతా విలియమ్స్ రోదసీ యాత్ర
- విడాకులపై సలహా అడిగిన యువతి.. శ్రీజ పోస్ట్ వైరల్
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- భారత్ సేవల రంగం నెమ్మది
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అక్రమాలు కో‘కొల్లు’లు
Advertisement