ఆ ఫోన్‌ నుంచి టన్నుల కొద్దీ బంగారం! | Samsung to extract Gold and other valuble materials from Samsung Note 7 mobiles | Sakshi
Sakshi News home page

ఆ ఫోన్‌ నుంచి టన్నుల కొద్దీ బంగారం!

Jul 23 2017 10:28 AM | Updated on Sep 5 2017 4:43 PM

ఆ ఫోన్‌ నుంచి టన్నుల కొద్దీ బంగారం!

ఆ ఫోన్‌ నుంచి టన్నుల కొద్దీ బంగారం!

సాంకేతిక లోపాలతో గతేడాది అత్యధికంగా వార్తల్లో నిలిచిన శాంసంగ్‌ గెలాక్సీ నోట్‌ 7 ఫోన్‌ నుంచి టన్నల కొద్దీ బంగారం రానుందట.

సాంకేతిక లోపాలతో గతేడాది అత్యధికంగా వార్తల్లో నిలిచిన శాంసంగ్‌ గెలాక్సీ నోట్‌ 7 ఫోన్‌ నుంచి టన్నల కొద్దీ బంగారం రానుందట. ఈ విషయాన్ని స్వయంగా శాంసంగే వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా అమ్ముడైన శాంసంగ్‌ నోట్‌ 7 ఫోన్‌లు అన్నింటిని వెనక్కి తీసుకుంటున్నట్లు కంపెనీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇలా ప్రపంచదేశాల నుంచి తిరిగి సేకరించిన గెలాక్సీ నోట్‌7 ఫోన్లను రీ-సైకిల్‌ చేయనుంది. గెలాక్సీ నోట్‌7 ఫోన్లను రీ-సైకిల్‌ చేయడం ద్వారా 157 టన్నుల బంగారం, వెండి, కోబాల్ట్‌, రాగి వంటి విలువైన లోహాలను సేకరించనునట్లు తెలిపింది.

ఈ నెల చివర్లోగా ఈ ప్రక్రియను శాంసంగ్‌ ఆరంభించే అవకాశం ఉంది. అయితే, ఫోన్‌లోని కొన్ని ముఖ్యభాగాలను మాత్రం విడగొట్టి భద్రపరచనుంది శాంసంగ్‌. ఎమోఎల్‌ఈడీ డిస్‌ప్లే, మెమొరీ సెమీ కండక్టర్లు, కెమేరా మాడ్యూల్స్‌ను విడిగా భద్రపరుస్తుంది. రీ-సైకిల్‌ ప్రక్రియ మొత్తం ఎకో-ఫ్రెండ్లీ పద్ధతుల్లోనే చేయనున్నట్లు తెలిసింది. కొన్ని విడి భాగాలను నోట్‌ ఎఫ్‌ఈ సర్వీస్‌ మెటీరియల్‌గా వినియోగించనుంది. అయితే, ఎవరికీ విక్రయించని నోట్‌7 ఫోన్లకు సరికొత్త టెక్నాలజీతో తీర్చిదిద్దిన 3,200 ఎంఏహెచ్‌ బ్యాటరీని అమర్చి నోట్‌ ఎఫ్‌ఈ పేరుతో విపణిలోకి తీసుకొచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement