5 నెలల్లో 50 వేల కియా కార్ల విక్రయాలు

Sales Of 50 Thousand KIA Cars Within 5 Months - Sakshi

ముంబై: దక్షిణ కొరియా ఆటోమొబైల్‌ దిగ్గజం కియా మోటార్స్‌.. భారత్‌లో తాజాగా మరో మైలు రాయిని అధిగమించింది. గతేడాది ఆగస్టులో తన ‘సెల్టోస్‌ మిడ్‌–సైజ్‌ ఎస్‌యూవీ’ కారును ఇక్కడి మార్కెట్లోకి ప్రవేశపెట్టిన ఈ సంస్థ.. కేవలం 5 నెలల్లోనే 50,000 యూనిట్ల అమ్మకాలను నమోదుచేసింది. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం ప్లాంట్‌లో కారు ఉత్పత్తి అవుతోన్న విషయం తెలిసిందే కాగా, ఈ కారు అమ్మకాల స్పీడును చూసి మరిన్ని మోడళ్లను భారత్‌లో ప్రవేశపెట్టాలని కంపెనీ భావిస్తోంది. వచ్చే నెల 5 నుంచి 12 వరకు జరిగే ఆటో ఎక్స్‌పో 2020లో వీటిని ప్రదర్శించనుంది. కాంపాక్ట్‌ ఎస్‌యూవీతో పాటు కార్నివల్‌ ఎంపీవీ కార్లను ప్రదర్శనకు ఉంచనున్నట్లు వెల్లడించింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top