ఈనెల 16న సాక్షి–మైత్రి ఇన్వెస్టర్స్‌ సదస్సు | Sakshi -Maitri Investors Conference on 16th of this month | Sakshi
Sakshi News home page

ఈనెల 16న సాక్షి–మైత్రి ఇన్వెస్టర్స్‌ సదస్సు

Sep 12 2018 12:18 AM | Updated on Sep 12 2018 12:18 AM

Sakshi -Maitri Investors Conference on 16th of this month

హైదరాబాద్‌: స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడులు, ఆర్థిక ప్రణాళికలు, ఇన్వెస్ట్‌మెంట్స్‌ నిర్వహణ వంటి వాటిపై అవగాహన కల్పించేందుకు ‘సాక్షి’ మైత్రి ఇన్వెస్టర్స్‌ క్లబ్‌ సదస్సు ఈ సారి నెల్లూరులో జరగనుంది. ఈ నెల 16న ఆదివారం నెల్లూరులోని వాహబ్‌పేట్‌లోని హోటల్‌ భవానీ రెసిడెన్సీలో సాక్షి–మైత్రి ఇన్వెస్టర్స్‌ క్లబ్‌ సదస్సు జరగనుంది.

ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరిగే ఈ సదస్సుకు పెట్టుబడులపై ఆసక్తి ఉన్నవారెవరైనా హాజరుకావచ్చు. ప్రవేశం ఉచితం. ఈ కార్యక్రమంలో సెంట్రల్‌ డిపాజిటరీ సర్వీసెస్‌ రీజినల్‌ మేనేజర్‌ శివప్రసాద్‌ వెనిశెట్టి, కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌ జనరల్‌ మేనేజర్‌ ఎల్‌ రాజేశ్, వైస్‌ ప్రెసిడెంట్‌ ఎస్‌ వెంకట శ్రీనివాస్‌ రెడ్డి తదితరులు పా ల్గొని ఇన్వెస్టర్లకు సలహాలు, సూచనలు ఇస్తారు.

Advertisement
 
Advertisement
Advertisement