ఎన్‌సీఎల్‌టీ ముందుకు మరో 24 కేసులు | RBI 's second list | Sakshi
Sakshi News home page

ఎన్‌సీఎల్‌టీ ముందుకు మరో 24 కేసులు

Jan 2 2018 2:04 AM | Updated on Jan 2 2018 9:09 AM

RBI 's second list - Sakshi

న్యూఢిల్లీ: ఆర్‌బీఐ రెండో జాబితాలోని 28 భారీ రుణ ఎగవేతదారులకు గాను 24 కేసులను దివాలా చర్యల కింద జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్‌(ఎన్‌సీఎల్‌టీ)కు నివేదించాలని బ్యాంకులు నిర్ణయించాయి. ఈ 28 ఎన్‌పీఏ కేసులను పరిష్కరించుకోవాలని లేదా డిసెంబర్‌ 31 నాటికి ఎన్‌సీఎల్‌టీకి నివేదించాలని ఆర్‌బీఐ గడువు ఇచ్చింది. దేశ బ్యాంకింగ్‌ వ్యవస్థలోని మొత్తం మొండి బకాయిల్లో ఈ 28 ఖాతాదారులు ఎగవేసిన మొత్తం రూ.4 లక్షల కోట్లుగా ఉంది.

వీటిలో అన్రక్‌ అల్యూమినియం, జయస్వాల్‌ నెకో, సోమా ఎంటర్‌ ప్రైజెస్, జైప్రకాశ్‌ అసోసియేట్స్‌ మినహా మిగిలిన కేసులన్నీ ఎన్‌సీఎల్‌టీ ముందుకు వెళ్లనున్నాయని ఓ బ్యాంకు అధికారి తెలిపారు. దివాలా చర్యలు ఎదుర్కోబోయే వాటిలో ఐవీఆర్‌సీఎల్, ఉత్తమ్‌ గాల్వా స్టీల్, విసా స్టీల్, ఎస్సార్‌ ప్రాజెక్టŠస్, నాగార్జున ఆయిల్, రుచి సోయా, ఉత్తమ్‌ గాల్వా మెటాలిక్‌ తదితర కేసులు ఉన్నాయి.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement