పోస్కో ఒడిశా సెజ్ ఆమోదం రద్దు | posko odisa sez cancel:central government | Sakshi
Sakshi News home page

పోస్కో ఒడిశా సెజ్ ఆమోదం రద్దు

May 5 2016 2:34 AM | Updated on Aug 20 2018 9:16 PM

దక్షిణ కొరియాకు చెందిన పొస్కో కంపెనీకి ఒడిశాలో ప్రత్యేక ఆర్థిక మండలం(సెజ్) ఏర్పాటు కోసం ఇచ్చిన సూత్రప్రాయ ఆమోదాన్ని కేంద్రం రద్దు చేసింది.

న్యూఢిల్లీ: దక్షిణ కొరియాకు చెందిన పొస్కో కంపెనీకి ఒడిశాలో ప్రత్యేక ఆర్థిక మండలం(సెజ్) ఏర్పాటు కోసం ఇచ్చిన సూత్రప్రాయ ఆమోదాన్ని కేంద్రం రద్దు చేసింది. గత నెల 28న జరిగిన సమావేశంలో వాణిజ్య కార్యదర్శి రీటా తియోతియా అధ్యక్షతన గల బోర్డ్ ఆఫ్ అప్రూవల్స్(బీఓఏ)  ఈ నిర్ణయాన్ని తీసుకుంది. ఈ సెజ్ కోసం పోస్కో కంపెనీ చేసిన ప్రయత్నలు సంతృప్తికరంగా లేవని భావించిన బీఓఏ కమిటీ సెజ్ ఆమోదాన్ని రద్దు చేయాలని నిర్ణయం తీసుకుందని బీఓఏ మినట్స్ వెల్లడించాయి. ఒడిశాలోనే లాంకో సోలార్ ఏర్పాటు చేయనున్న సెజ్ అనుమతిని కూడా ఇదే కారణాలతో బీఓఏ రద్దు చేసింది.

Advertisement
 
Advertisement
Advertisement