విద్యార్థినుల కోసం మైక్రోసాఫ్ట్ ‘విమెన్ ఇన్ టెక్’ ప్రోగ్రామ్ | Microsoft India launches ‘women in tech’ initiative | Sakshi
Sakshi News home page

విద్యార్థినుల కోసం మైక్రోసాఫ్ట్ ‘విమెన్ ఇన్ టెక్’ ప్రోగ్రామ్

Sep 25 2014 12:47 AM | Updated on Sep 27 2018 4:07 PM

విద్యార్థినుల కోసం మైక్రోసాఫ్ట్ ‘విమెన్ ఇన్ టెక్’ ప్రోగ్రామ్ - Sakshi

విద్యార్థినుల కోసం మైక్రోసాఫ్ట్ ‘విమెన్ ఇన్ టెక్’ ప్రోగ్రామ్

మైక్రోసాఫ్ట్ ఇండియా కంపెనీ విమెన్ ఇన్ టెక్ కార్యక్రమాన్ని బుధవారం ప్రారంభించింది.

న్యూఢిల్లీ: మైక్రోసాఫ్ట్ ఇండియా కంపెనీ విమెన్ ఇన్ టెక్ కార్యక్రమాన్ని బుధవారం ప్రారంభించింది. ఏడాది కాలంలో పది లక్షల మంది మహిళలకు ఐటీ శిక్షణ ఇవ్వడానికి, ఐటీ రంగంలో వారికి మార్గదర్శకంగా ఉండటానికి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించామని మైక్రోసాఫ్ట్ ఇండియా తెలిపింది.  ప్రస్తుతం భారత ఐటీ రంగంలో పది లక్షల మంది మహిళలున్నారని, కొన్నేళ్లలో ఈ సంఖ్యను రెట్టింపు చేయడం లక్ష్యమని మైక్రోసాఫ్ట్ ఇండియా చైర్మన్ భాస్కర్ ప్రామాణిక్ చెప్పారు.

 విమెన్ ఇన్ టెక్ కార్యక్రమాన్ని పాఠశాల విద్యార్ధినులు, సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్(ఎస్‌టీఈఎం-స్టెమ్) విద్యార్ధినులు, మహిళా ఐటీ ఉద్యోగులు, ఎంటర్‌ప్రెన్యూర్‌ల కోసం ఉద్దేశించామని మైక్రోసాఫ్ట్ ఇండియా చీఫ్ ఎవాంజలిస్ట్ జోసెఫ్ లండేస్ చెప్పారు. ఈ కార్యక్రమం ద్వారా పాఠశాల విద్యార్థినులు ఒక ఐటీ ఉద్యోగిగా కానీ, సొంత ఐటీ వెంచర్ ప్రారంభించగల వ్యక్తిగా గానీ ఎదిగేందుకు తగిన తోడ్పాటునందిస్తామని వివరించారు. ఐటీని కెరీర్‌గా తీసుకునేలా బాలికలను, టెక్నాలజీ ఎంటర్‌ప్రెన్యూర్లుగా మారేందుకు మరింత మంది మహిళలకు ప్రోత్సాహం అందిస్తామన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement