
సీఎం సహాయ నిధికి మలబార్ గోల్డ్ రూ.13 లక్షలు
మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ కంపెనీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి..
హైదరాబాద్: మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ కంపెనీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.13 లక్షల విరాళం ఇచ్చింది. వైజాగ్ హుద్హుద్ తుఫాన్ బాధితుల సహాయార్థం ఈ విరాళమిచ్చామని మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఒక ప్రకటనలో తెలిపింది.