మోదీ 2.0 ఏడాది పాలన: రూ.27లక్షల కోట్లను కోల్పోయిన ఇన్వెస్టర్లు | Investors lose Rs 27L cr in equity wealth | Sakshi
Sakshi News home page

మోదీ 2.0 ఏడాది పాలన: రూ.27లక్షల కోట్లను కోల్పోయిన ఇన్వెస్టర్లు

May 30 2020 3:54 PM | Updated on May 30 2020 4:43 PM

Investors lose Rs 27L cr in equity wealth - Sakshi

నరేంద్ర మోదీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చి ఏడాది గడిచింది. ఈ ఏడాది కాలంలో దలాల్‌ స్ట్రీట్‌ ఏకంగా రూ.27లక్షల కోట్ల సంపదను కోల్పోయినట్లు గణాంకాలు చెబుతాయి. హరించుకుపోయిన ఈ మొత్తం ధనం దేశ జీడీపీలో 13.5శాతంగా ఉంది. కోవిడ్‌ సంక్షోంభంతో కుదేలైన ఆర్థిక వ్యవస్థకు ఇటీవల కేంద్ర ప్రకటించిన రూ.20లక్షల కోట్ల పోలిస్తే 35శాతం ఈ మొత్తం విలువ అధికం. ఇదే ఏడాదిలో ప్రతి 10స్టాకుల్లో 9 స్టాకులు నెగిటివ్‌ రిటర్న్‌లను ఇచ్చాయి. ఇదే సమయంలో బీఎస్‌ఈలో లిస్టైన మొత్తం కంపెనీల్లో కేవలం 10శాతం కంపెనీల షేర్లు మాత్రం రెండంకెల ఆదాయాలను ఇచ్చాయి. 


మోదీ ఏడాది పాలనకు 10మార్కులకు 7 మార్కులిచ్చిన హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ దీపక్‌ జైసనీ మాట్లాడుతూ ‘‘ ప్రభుత్వ పనితీరు నిర్ధారణకు మార్కెట్-క్యాపిటలైజేషన్ ప్రమాణికం కాదు. మార్కెట్ల పనితీరు కేవలం ప్రభుత్వ పాలసీ మీద మాత్రమే ఆధాపడి ఉండదు. అంతర్జాతీయ పరిణామాలు, నిబంధనలు, అంతరాయాలతో పాటు ఇతర అనేక అంశాలు మార్కెట్లను ప్రభావితం చేస్తాయి.’’అని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement