రిటర్నుల ఈ–అసెస్‌మెంట్‌ను నోటిఫై చేసిన కేంద్రం | Government Notify Income tax Returns e assessment | Sakshi
Sakshi News home page

రిటర్నుల ఈ–అసెస్‌మెంట్‌ను నోటిఫై చేసిన కేంద్రం

Sep 14 2019 11:24 AM | Updated on Sep 14 2019 11:24 AM

Government Notify Income tax Returns e assessment - Sakshi

న్యూఢిల్లీ: దసరా (అక్టోబర్‌ 8) నుంచి ఎల్రక్టానిక్‌ రూపంలోనే రిటర్నుల పరిశీలన (ఈ–అసెస్‌మెంట్‌)ను ప్రారంభించేందుకు వీలుగా కేంద్ర ఆరి్థక శాఖ శుక్రవారం గెజిట్‌ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీంతో జాతీయ స్థాయిలో ఈ–అసెస్‌మెంట్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు వీలు పడుతుంది. ఈ అసెస్‌మెంట్‌కు సంబంధించి వ్యక్తులు వ్యక్తిగతంగా లేదా అధికార ప్రతినిధి ద్వారా ఆదాయపన్ను శాఖ అధికారుల ముందు హాజరవ్వాల్సిన అవసరం లేదని నోటిఫికేషన్‌ స్పష్టం చేసింది. వ్యక్తిగతంగా హాజరై ఏవైనా తెలియజేయదలిస్తే, అందుకు అనుమతిస్తామని పేర్కొంది. పన్ను రిటర్నుల మదింపునకు సంబంధించి ఈ అసెస్‌మెంట్‌ కేంద్రం నోటీసులు జారీ చేస్తే, దీనికి సంబంధించి 15 రోజుల్లోపు స్పందన తెలియజేసిన కేసులను అసెసింగ్‌ అధికారికి ఆటోమేటిగ్గా బదిలీ చేయడం జరుగుతుందని తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement