రూ. 30,000 దాటిన బంగారం | Gold price tops Rs 30000-mark, hits two-year high on global cues | Sakshi
Sakshi News home page

రూ. 30,000 దాటిన బంగారం

Apr 30 2016 1:12 AM | Updated on Sep 3 2017 11:03 PM

రూ. 30,000 దాటిన బంగారం

రూ. 30,000 దాటిన బంగారం

అంతర్జాతీయ ట్రెండ్‌ను అనుసరిస్తూ మన దేశంలో పసిడి ధరలు పైకి ఎగిసాయి.

రెండేళ్ల గరిష్టంలో ధరలు
న్యూఢిల్లీ: అంతర్జాతీయ ట్రెండ్‌ను అనుసరిస్తూ మన దేశంలో పసిడి ధరలు పైకి ఎగిసాయి. దేశ రాజధానిలో పసిడి ధర (10 గ్రాములు) చూస్తుండగానే శుక్రవారం రూ.30,000 మార్క్‌ను అధిగమించింది. ఇది రెండేళ్ల గరిష్ట స్థాయి.  బ్యాంక్ ఆఫ్ జపాన్ వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగిస్తున్నట్లు ప్రకటించడం, అమెరికా ఫెడ్ కూడా వడ్డీ రేట్లను స్థిరంగా కొనసాగించడం, డాలర్ విలువ పది నెలల కనిష్టానికి చేరడం తదితర కారణాల వల్ల అంతర్జాతీయ మార్కెట్‌లో పుత్తడి ధరలు పెరిగాయి. దీనికి తోడు దేశంలో జువెలర్స్ నుంచి డిమాండ్ పెరగడం కూడా ఇక్కడి పసిడి ధరల పెరుగుదల ఒక కారణ మయ్యాయి.

ప్రపంచ మార్కెట్‌లో కడపటి సమాచారంమేరకు పసిడి ధర ఔన్స్‌కు 1,295 డాలర్లకు పెరిగింది. వెండి ధర 1.7 శాతం పెరుగుదలతో 17.84 డాలర్లకు చేరింది. వెండికి గతేడాది జనవరి నుంచి చూస్తే ఇదే గరిష్ట స్థాయి. దేశ రాజధానిలో 10 గ్రాముల 99.9%, 99.5 శాతం స్వచ్ఛతగల బంగారం ధరలు రూ.350 పెరుగుదలతో వరుసగా రూ.30,250కు, రూ.30,100కు చేరాయి. 2014, మే 13 నుంచి చూస్తే ఇదే గరిష్ట స్థాయి. అలాగే పరిశ్రమలు సహా నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ పెరగడంతో వెండి ధర (కిలో) కూడా రూ.600 పెరుగుదలతో రూ.41,600కు ఎగసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement