ఫార్చ్యూన్‌–500లో ఏడు భారత కంపెనీలు  | Fortune 500 companies appointed a record percentage | Sakshi
Sakshi News home page

ఫార్చ్యూన్‌–500లో ఏడు భారత కంపెనీలు 

Aug 2 2018 12:10 AM | Updated on Sep 27 2018 4:42 PM

Fortune 500 companies appointed a record percentage - Sakshi

న్యూయార్క్‌: ఫార్చ్యూన్‌–500 తాజా జాబితాలో భారత్‌ నుంచి ఏడు కంపెనీలకు చోటు లభించింది. భారత్‌ నుంచి అత్యంత విలువైన కంపెనీగా (ఆదాయం పరంగా) ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐవోసీ) మరోసారి నిలిచింది. 2017లో 168వ స్థానంలో ఉన్న ఐవోసీ 65.9 మిలియన్‌ డాలర్ల ఆదాయం ఉన్న కంపెనీగా ఈ ఏడాది జాబితాలో 137కు చేరుకుంది. భారతదేశ సంపన్న పారిశ్రామికవేత్త ముకేశ్‌ అంబానీకి చెందిన ఆర్‌ఐఎల్‌ గతేడాది 203వ ర్యాంకులో ఉండగా, 62.3 బిలియన్‌ డాలర్ల ఆదాయంతో 53 స్థానాలను మెరుగుపరుచుకుని 148వ స్థానానికి చేరుకుంది. మొదటి స్థానంలో అమెరికాకు చెందిన వాల్‌మార్ట్‌ ఉంది. 47.5 బిలియన్‌ డాలర్ల ఆదాయంతో ఓఎన్‌జీసీ మరోసారి ఫార్చ్యూన్‌ జాబితాలో చోటు సంపాదించుకుంది. 197 ర్యాంకు సొంతం చేసుకుంది. 47.5 బిలియన్‌ డాలర్ల ఆదాయం కలిగిన ఎస్‌బీఐకి 216వ ర్యాంకు కేటాయించింది. 

టాటా మోటార్స్‌ గతేడాది 247వ స్థానంలో ఉంటే కాస్త మెరుగుపడి 232కు వచ్చింది. బీపీసీఎల్‌ 314వ స్థానంలో (గతేడాది 360వ ర్యాంకు), రాజేష్‌ ఎక్స్‌పోర్ట్స్‌ 405వ ర్యాంకు (గతేడాది 295వ స్థానంలో)లో ఉన్నాయి. ఈ జాబితాలో అత్యంత లాభదాయకత కలిగిన భారతీయ కంపెనీగా ఆర్‌ఐఎల్‌ అగ్ర స్థానంలో ఉండడం గమనార్హం. అంతర్జాతీయంగా అధిక లాభాలు కలిగిన కంపెనీల జాబితాలో ఆర్‌ఐఎల్‌ 99వ స్థానంలో ఉంది. చైనాకు చెందిన స్టేట్‌గ్రిడ్, సినోపెక్‌ గ్రూపు, చైనా నేషనల్‌ ప్రెటోలియం కార్ప్‌ టాప్‌–10లో నిలిచాయి.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement