రిలయన్స్‌ జియోలో ఫేస్‌బుక్‌ భారీ పెట్టుబడి

Facebook Buys 9.99 Per Cent Stake In Reliance Jio - Sakshi

సాక్షి, ముంబై : దేశీయ దిగ్గజ కంపెనీ రిలయన్స్‌ టెలికాం యూనిట్‌  జియోలో సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ భారీ పెట్టుబడి పెట్టింది. మొత్తం 5.7 బిలయన్‌ డాలర్ల(దాదాపు రూ. 43,574 కోట్లు) పెట్టుబడి పెట్టినట్టు ఫేస్‌బుక్‌ బుధవారం ప్రకటించింది. దీంతో జియోలో 9.9 శాతం వాటాను ఫేస్‌బుక్‌ కొనుగోలు చేసింది. తద్వారా ఫేస్‌బుక్‌​ జియోలో అతిపెద్ద మైనారిటీ వాటాను సొంతం చేసుకున్నట్టు అయింది. ఫేస్‌బుక్ పెట్టుబడి తరువాత జియో ప్లాట్ ఫామ్స్ విలువ రూ. 4.62 లక్షల కోట్లకు పెరిగినట్లవుతుంది. దేశంలోని టెక్నాలజీ రంగంలో ఇదే అతిపెద్ద ఎఫ్‌డీఐ అని రిలయన్స్‌ తెలిపింది. ఫేస్‌బుక్‌తో భాగస్వామ్యం వల్ల రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌పై అప్పుల భారం తగ్గనుంది. (రిలయన్స్, ఫేస్బుక్: వన్ స్టాప్ సూపర్ యాప్)

తమ మెసేజింగ్‌ ఫ్లాట్‌ఫామ్‌ వాట్సాప్‌, రిలయన్స్‌కు చెందిన ఈ-కామర్స్‌ వెంచర్‌ జియో మార్ట్‌తో కలిసి ప్రజలు చిన్న వ్యాపారాలతో కనెక్ట్ అయ్యేలా దృష్టి సారించనున్నట్లు తెలిపింది. అలాగే దేశంలో డిజిటల్ ఆపరేషన్స్లో తన పరిధిని మరింత విస్తరించుకోవాలని ఫేస్‌బుక్‌  యోచిస్తోంది. ఈ క్రమంలోనే రిలయన్స్‌ జియోలో భారీగా పెట్టుబడి పెట్టింది. ఇటీవల వాట్సాప్‌ భారత్‌లో సురక్షితమైన డిజిటల్‌ చెల్లింపులకు అనుమతి పొందినట్టుగా తెలుస్తోంది.  కాగా, వాట్సాప్‌కు భారత్‌లో 400 మిలియన్ల యూజర్స్‌ ఉన్నారు. స్మార్ట్‌ ఫోన్‌ వినియోగించేవారిలో 80 శాతం మంది వాట్సాప్‌ను వాడుతున్నారు.(జుకర్బర్గ్ విరాళం రూ.187 కోట్లు )

జియోలో పెట్టుబడిపై ఫేస్‌బుక్‌ సీఈఓ మార్క్‌ జుకర్‌బర్గ్‌ స్పందిస్తూ.. ‘భారత్‌లో ప్రజలకు వాణిజ్య పరమైన అవకాశాలు కల్పించేలా రిలయన్స్‌తో కలిసి పనిచేయనున్నాం. ఫేస్‌బుక్‌, వాట్సాప్‌లకు ఇండియాలో భారీ సంఖ్యలో వినియోగదారులు ఉన్నారు. ప్రతి ఆర్థిక వ్యవస్థకు చిన్న వ్యాపారాలు చాలా ముఖ్యమైనవి. భారత్‌లో దాదాపు 60 మిలియన్ల చిన్న వ్యాపారాలు ఉన్నాయి. చాలా వరకు ఉద్యోగాలు వాటిపై ఆధారపడి ఉన్నాయి. కోట్లాది మంది భారతీయులు చిన్న చిన్న వ్యాపారాలు ఆన్‌లైన్‌లో పొందడంలో జియో కీలక పాత్ర పోషించింది. ఈ క్రమంలోనే భారత్‌లో వాణిజ్యపరంగా కొత్త అవకాశాలు కల్పించడానికి జియోతో భాగస్వామ్యం కుదుర్చుకున్నాం. చాలా మంది వ్యాపారవేత్తలు వారి బిజినెస్‌ను వృద్ధి చేసుకోవడంలో భాగంగా వినియోగదారులతో కమ్యూనికేట్‌ అవ్వడానికి డిజిటల్‌ పరికరాలు అవసరం ఉంది. ఈ భాగస్వామ్యం కల్పించిన ముఖేశ్‌ అంబానీ, జియో టీమ్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నాను’ అని అన్నారు.  (జియోపై కన్నేసిన ఫేస్ బుక్ : కరోనా దెబ్బ)

2016లో  దేశంలో అధికారికంగా సేవలను ప్రారంబించిన రిలయన్స్  జియో వేగంగా అభివృద్ధి చెంది భారతీయ టెలికాం మార్కెట్లోకి టాప్ లోకి  దూసుకు వచ్చింది.  మొబైల్ టెలికాంతోపాటు, హోమ్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీసులు, ఈ-కామర్స్ వరకు ప్రతిదానికీ విస్తరించింది.  అంతేకాదు యుఎస్ టెక్ గ్రూపులతో పోటీ పడగల ఏకైక సంస్థగా రిలయన్స్ అవతరించింది. గత నెలలోనే ఫేస్‌బుక్‌.. రిలయన్స్‌ జియో 10 శాతం వాటా కొనుగోలు చేయనున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసింది.(లాక్డౌన్.2 : జియో గుడ్ న్యూస్)

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top