విజయ్‌ మాల్యాకు మరో షాక్‌

Court allows liquidation of Vijay Mallya assets - Sakshi

మాల్యా ఆస్తుల వేలానికి  రంగం సిద్దం

ఎస్‌బీఐ కన్సార్ణియానికి పీఎల్‌ఏ కోర్టు అనుమతి

సాక్షి, ముంబై: వేలకోట్ల రూపాయలను ప్రభుత్వ బ్యాంకులకు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన విజయ్‌మాల్యా(63)కు మరో ఎదురు దెబ్బ తగిలింది. ఇప్పటికే స్వాధీనం చేసుకున్న మాల్యా ఆస్తుల వేలానికి రంగం సిద్దమైంది. ఈ మేరకు పీఎంఎల్‌ఏ ముంబై కోర్టు అనుమతినిచ్చింది. రూ.13వేల కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేయనుంది. ఎస్‌బీఐ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్షియం ఈ ఆస్తులను వేలం వేయనుంది. అయితే జనవరి 18 తరువాత మాత్రమే ఈ ఆదేశాలను పాటించాలని కూడా కోర్టు వెల్లడించింది. దీనిపై సంబంధిత పార్టీలు ఈ ఆదేశాలపై  బొంబాయి కోర్టులో అప్పీలు చేసుకోవచ్చని పేర్కొంది.  సీజ్‌ చేసిన ఆస్తుల లిక్విడేషన్‌కు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని గత ఏడాది ఫిబ్రవరిలో ఈడీకోర్టుకు  తెలిపిన నేపథ్యంలో ఈ పరిణామం  చోటు చేసుకుంది.   

కాగా మనీ లాండరింగ్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న విజయ్‌ మాల్యా 2016 మార్చిలో లండన్‌కు పారిపోయాడు. 2017లో  అరెస్ట్‌  అయిన ప్రస్తుతం బెయిల్‌మీద ఉన్నాడు. మాల్యాను భారత్‌కు రప్పించేదుకు భారత ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో కొత్త ఫుజిటివ్‌ ఎకనమిక్‌ అఫెండర్స్‌  చట్ట ప్రకారం మాల్యాను ఆర్థిక నేరస్తుడిగా  పీఎంఎల్‌ఏ కోర్టు గత ఏడాది  ప్రకటించిన సంగతి తెలిసిందే.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top