బైబ్యాక్ ఆలోచనలో డాక్టర్ రెడ్డీస్ | Sakshi
Sakshi News home page

బైబ్యాక్ ఆలోచనలో డాక్టర్ రెడ్డీస్

Published Fri, Feb 12 2016 1:08 AM

బైబ్యాక్ ఆలోచనలో డాక్టర్ రెడ్డీస్ - Sakshi

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: యూఎస్‌ఎఫ్‌డీఏ హెచ్చరికల నేపథ్యంలో భారీగా పతనమైన షేర్లను కొనుగోలు చేయాలని డాక్టర్ రెడ్డీస్ యాజమాన్యం నిర్ణయించింది. ప్రస్తుతం 25.57% వాటాను కలిగి ఉన్న ప్రమోటర్లు బైబ్యాక్ ద్వారా వాటా పెంచుకునే ఆలోచనలో ఉన్నారు. వచ్చే వారం జరిగే బోర్డు సమావేశంలో బైబ్యాక్‌పై నిర్ణయం తీసుకోనున్నట్లు కంపెనీ స్టాక్ ఎక్స్ఛేం జీలకు తెలియచేసింది. ప్రస్తుతం కంపెనీ షేరు రూ.2,887 వద్ద కదులుతోంది.

Advertisement
Advertisement