ఎయిర్‌టెల్‌కు 5,237 కోట్ల నష్టాలు 

Bharti Airtel Reports Loss Of Over Rs 5200 Crore In Fourth Quarter - Sakshi

న్యూఢిల్లీ : టెలికం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్‌ కంపెనీకి ఈ ఏడాది మార్చితో ముగిసిన క్వార్టర్‌కు రూ.5,237 కోట్ల నికర నష్టాలు వచ్చాయి. వన్‌టైమ్‌ స్పెక్ట్రమ్‌ చార్జీలకు సంబంధించి తాజా తీర్పు కారణంగా రూ.7,004 కోట్లు చెల్లించడంతో ఈ నష్టాలు ఈ స్థాయిలో పెరిగాయని కంపెనీ తెలిపింది. గత ఏడాది మార్చి క్వార్టర్‌లో రూ.107 కోట్ల నికర లాభం ఆర్జించింది.  ఆదాయం రూ.20,602 కోట్ల నుంచి 15% వృద్ధితో రూ.23,723 కోట్లకు పెరిగింది.  ఒక్కో వినియోగదారుడి నుంచి లభించే సగటు రాబడి (ఏఆర్‌పీయూ) రూ.123 నుంచి రూ.154కు పెరిగింది. ఈ కంపెనీ గత ఏడాది డిసెంబర్‌లోటెలికం సేవల ధరలను  పెంచింది. మార్కెట్‌ ముగిసిన తర్వాత ఫలితాలు వెలువడ్డాయి. బీఎస్‌ఈలో భారతీ ఎయిర్‌టెల్‌ షేర్‌ 2.6 శాతం నష్టంతో రూ.540 వద్ద ముగిసింది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top