21 నుంచి బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ రిపబ్లిక్‌ డే సేల్‌

Bajaj Finserv Republic Day Deal from 21st - Sakshi

ముంబై: గణతంత్ర దినోత్సరం సందర్భంగా బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ పలు ఆఫర్లను ప్రకటించింది. ఈ నెల 21 నుంచి 26వ తేదీ వరకు రిపబ్లిక్‌ డే సేల్‌ నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ డైరెక్ట్‌ ఆన్‌లైన్‌ పోర్టల్‌   https:// www.bajajfinservmarkets.in/ emistore/  ద్వారా ఈఎంఐ  కొనుగోళ్లపై రూ.2019 క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌ ఇస్తున్నట్టు ప్రకటించింది. కన్జ్యూమర్‌ ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తులను నోకాస్ట్‌ ఈఎంఐ కింద, ఎటువంటి డౌన్‌ పేమెంట్‌ లేకుండా కొనుగోలు చేయవచ్చని తెలిపింది. స్మార్ట్‌ఫోన్లను కొనుగోలు చేసిన 4 గంటల్లో, ఇతర ఎలక్ట్రానిక్‌ పరికరాలను 24 గంటల్లో డెలివరీ చేస్తామని ప్రకటించింది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top