28% పెరిగిన పీసీ అమ్మకాలు | 28% increase in sales of PC | Sakshi
Sakshi News home page

28% పెరిగిన పీసీ అమ్మకాలు

Aug 18 2018 2:17 AM | Updated on Aug 18 2018 2:17 AM

28% increase in sales of PC - Sakshi

న్యూఢిల్లీ: దేశీ పర్సనల్‌ కంప్యూటర్‌ (పీసీ) అమ్మకాలు ఈ ఏడాది ఏప్రిల్‌–జూన్‌ కాలంలో 28.1 శాతం వృద్ధి చెందినట్లు రీసెర్చ్‌ సంస్థ ఐడీసీ వెల్లడించింది. ఈకాలంలో 22.5 లక్షల యూనిట్లు అమ్ముడైనట్లు తెలిపింది. ఈ విభాగంలో హెచ్‌పీ 31.6% మార్కెట్‌ వాటాతో తన లీడర్‌ షిప్‌ను కొనసాగించగా.. ఆ తరువాత స్థానంలో ఉన్న డెల్‌ 23.7%, లెనొవో 18% మార్కెట్‌ వాటాను నిలబెట్టుకున్నట్లు వెల్లడించింది. ఇక ఏడాది ప్రాతిపదికన నోట్‌బుక్స్‌ అమ్మకాలు 45.2 శాతం వృద్ధి చెంది మొత్తం పీసీ అమ్మకాలలో 61 శాతం వాటాను కలిగి ఉన్నట్లు తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement