‘హ్యాపీ’ న్యూ ఇయర్‌ షేర్లివి..!

2019 Brokerage Institutions recommendations in new year - Sakshi

 2019కి బ్రోకరేజీ సంస్థల సిఫారసులు

ఒడిదుడుకులు కొనసాగుతాయని అంచనా

సార్వత్రిక ఎన్నికలు, ముడి చమురు ధరలే కీలకం

ఫెడ్‌ రేట్లు పెరగనుండటమూ ప్రభావం చూపిస్తుంది

వినియోగ, వ్యవసాయ, ఐటీ షేర్లు బాగుంటాయి

బ్యాంకింగ్, ఎఫ్‌ఎంసీజీ షేర్లు పెరిగే అవకాశాలు

ఆటో రంగం మాత్రం అంతగా పెరగకపోవచ్చు

మార్కెట్లు... అంటే సెన్సెక్స్, నిఫ్టీ వంటి ఇండెక్స్‌లు మరీ అంతగా పడలేదు. లార్జ్‌ క్యాప్‌ షేర్లు కొన్ని పెరిగాయి... కొన్ని తగ్గాయి. కానీ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్‌ షేర్లు మాత్రం ఘోరంగా పతనమయ్యాయి. మార్కెట్లు జీవితకాల గరిష్ఠ స్థాయిల నుంచి 9 శాతం వరకూ పతనమైతే ఈ షేర్లు మాత్రం చాలావరకూ 50– 60– 70 శాతం కూడా పతనమయ్యాయి. మ్యూచ్‌వల్‌ ఫండ్‌ పథకాలు చాలావరకూ ఈ ఏడాది నష్టాలనే ఇచ్చాయి. నిజం చెప్పాలంటే ఏ షేర్లలో పెట్టుబడి పెట్టాలి? ఏ ఫండ్స్‌ మంచివి? అనేది 2018లో ఇన్వెస్టర్లకు ఎంత బుర్రబద్దలుకొట్టుకున్నా అర్థం కాలేదు. ఒకేరోజు సెన్సెక్స్‌ 600 పాయింట్లు పెరిగితే... మరోరోజు 500 పాయింట్లకు పైగా పతనం!!. ఇలాంటి ఎగుడు దిగుళ్లెన్నో సర్వసాధారణమైపోయాయి. దీనికి అంతర్జాతీయ వాణిజ్య యుద్ధభయాలు... ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్ల పెంపు.. దేశీయంగా ఎన్‌బీఎఫ్‌సీ సంక్షోభం వంటివన్నీ కారణమని చెప్పొచ్చు.  

కాకపోతే ఇంతటి ప్రతికూల పరిస్థితుల్లోనూ ఇన్వెస్టర్లు సంతోషించదగ్గ అత్యంత కీలక పరిణామం ఒకటుంది. అది... మార్కెట్లు పరిణితితో వ్యవహరించటం. గతానికి భిన్నంగా.. అగ్రరా జ్యం అమెరికా తుమ్మితే ప్రపంచానికి జలుబు చేస్తుందన్న నానుడికి విరుద్ధంగా, దేశీ ఇన్వెస్టర్లు ఈసారి మరీ భయపడిపోకుండా కాస్త తట్టుకుని నిలబడ్డారు. అమెరికా మార్కెట్లు ఎలా ఉన్నా... మన మార్కెట్లు మాత్రం ఇక్కడి పరిణామాలకు అనువుగా స్పందించటం మొదలుపెట్టాయి. పైపెచ్చు సిస్టమాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ విధానంలో (సిప్‌) వస్తున్న పెట్టుబడులు మరింత పెరిగాయి తప్ప నిలిచిపోలేదు. అందుకే మన ఇండెక్స్‌లు అంతర్జాతీయ మార్కెట్ల మాదిరి మరీ ఎక్కువ పతనం కాలేదన్నది వాస్తవం. ఇక 2019లో మరో ఐదారు నెలల్లో సార్వత్రిక ఎన్నికలు రాబోతున్నాయి. క్రూడ్‌ ధరలు తీవ్రమైన హెచ్చుతగ్గులకు గురవుతున్నాయి. అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ మరో రెండుమూడు సార్లు వడ్డీ రేట్లు పెంచుతామనే సంకేతాలిచ్చింది. ఈ నేపథ్యంలో కొత్త ఏడాదిలో మార్కెట్లు ఎలా ఉండబోతున్నాయనేది ఊహించటం కాస్త కష్టం. కాకపోతే కంపెనీల ఆదాయాల్ని బట్టి ఆయా షేర్లు రాణిస్తాయనేది బ్రోకరేజీ సంస్థల మాట. ఆయా బ్రోకరేజీ సంస్థలు కొత్త సంవత్సరం కోసం సిఫార్సు చేస్తున్న షేర్లలో కొన్ని ‘సాక్షి’ ప్రాఫిట్‌ పాఠకులకు ప్రత్యేకం..   
 

ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌
ఆశావహంగా బ్యాంకింగ్, క్యాపిటల్‌ గూడ్స్‌...
2018లో ఈక్విటీ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. వాణిజ్య యుద్ధ భయాలు మార్కెట్లను వెంటాడగా, ప్రపంచ వృద్ధి రేటుపైనా ప్రతికూల ప్రభావం చూపాయి. ప్రస్తుతం వాణిజ్య యుద్ధ భయాలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. క్రూడ్‌ ధరలూ తగ్గుతున్నాయి. 2019లో దేశీయంగా అంతర్గత అంశాల ప్రభావం మార్కెట్లపై గణనీయంగా ఉంటుంది. ఎన్నికల దరిమిలా కొత్తగా ఏ ప్రభుత్వం ఏర్పాటవుతుందనేది కీలకంగా మారింది. ఒకవేళ బలహీన సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడితే ఎకానమీ వృద్ధి పైనా ప్రభావం పడుతుంది. 2018–20 ఆర్థిక సంవత్సరాల మధ్యలో నిఫ్టీ 18.5 శాతం వృద్ధి నమోదు చేయొచ్చు. ఇందుకు బ్యాంకింగ్, ఎన్‌బీఎఫ్‌సీ రంగాల షేర్లు తోడ్పడవచ్చు. 2019లో ఆటోమొబైల్‌ రంగం బలహీనంగా ఉండే అవకాశం ఉంది. కొత్త సంవత్సరంలో బ్యాంకింగ్, క్యాపిటల్‌ గూడ్స్, సిమెంట్‌ రంగాలు ఆశావహంగా ఉంటాయని భావిస్తున్నాం. అలాగే, కన్సూ్యమర్‌ డ్యూరబుల్స్, ఎఫ్‌ఎంసీజీ, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సంస్థల షేర్లు కూడా సానుకూలంగా ఉండొచ్చు. మెటల్, మైనింగ్, రియల్‌ ఎస్టేట్, టెలికం, ఐటీ రంగాల పనితీరు తటస్థంగా ఉండవచ్చు. 2019లో బీజేపీ కూటమికి అత్యధికంగా సీట్లొచ్చే అవకాశం ఉంది. స్టాక్‌మార్కెట్‌పై దీని ప్రభావం కూడా ఉంటుంది.

జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌
వినియోగ వస్తువులు, ఐటీ స్టాక్స్‌ బెస్ట్‌
రాష్ట్రాల ఎన్నికలు, ఆర్‌బీఐ గందరగోళం, చమురు ధరల పతనం, తగ్గిన ద్రవ్యోల్బణం, వాణిజ్య లోటు తగ్గుముఖం పట్టడం, పారిశ్రామికోత్పత్తి గణాంకాలు మెరుగ్గా ఉండటం వంటివి డిసెంబర్‌లో స్టాక్‌ మార్కెట్లు హెచ్చు తగ్గులకు కారణమయ్యాయి. నిఫ్టీ 6 శాతం శ్రేణిలో తిరిగింది. రైతు రుణ మాఫీలు, జీఎస్‌టీ రేట్ల కోత మొదలైన పరిణామాలన్నీ మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. అధిక వినియోగం ద్వారా ఎకానమీకి ఇవి సానుకూలమైనవే అయినప్పటికీ.. సమీప భవిష్యత్‌లో ఈ ప్రజాకర్షక పథకాలతో దేశ ఆర్థిక విధానాలపై ప్రతికూల ప్రభావాలు పడవచ్చు. ఇప్పటికే వృద్ధి మందగించడం, వచ్చే 6 నెలల్లో మరింత నెమ్మదించనుండటంతో.. ఈ రిస్కులు మరింత పెరుగుతాయి. ఈ పరిస్థితుల్లో కొత్త ఏడాది ఐటీ కంపెనీలు సానుకూలంగా కనిపిస్తున్నాయి. వీటితో పాటు ఎఫ్‌ఎంసీజీ, వ్యవసాయ రంగాల షేర్లూ ఆకర్షణీయమే.  

సిఫార్సులు
1. ఎక్సైడ్‌ ఇండస్ట్రీస్‌
ప్రస్తుత ధర రూ. 265
ఎందుకంటే..?: స్టోరేజీ బ్యాటరీ వ్యాపారంలో దేశీయంగా 60 శాతం మార్కెట్‌ వాటాతో ఎక్సైడ్‌.. లీడర్‌ స్థానంలో ఉంది. క్యూ2లో అధిక ఇంధన ధరలు, రూపాయి పతనంతో ఎబిటా 30 బేసిస్‌ పాయింట్ల మేర క్షీణించింది. అయితే.. బ్యాటరీ ఇంజినీరింగ్‌ ఆమోదయోగ్యత పెరుగుతుండటం వంటి అంశాల వల్ల ఎక్సైడ్‌ దీర్ఘకాలిక అంచనాలు సానుకూలంగా ఉన్నాయి. 2018–2020 ఆర్థిక సంవత్సరాల మధ్య ఆదాయాలు, నికర లాభం 15–16 శాతం మేర వృద్ధి చెందే అవకాశం ఉంది.
 
2. పీఎన్‌సీ ఇన్‌ఫ్రాటెక్‌
ప్రస్తుత ధర రూ. 148
ఎందుకంటే..?: ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ నిర్మాణ, అభివృద్ధి, నిర్వహణ రంగ కంపెనీ ఇది. హైవేలు, వంతెనలు, ఎయిర్‌పోర్ట్‌ రన్‌వేల నిర్మాణంలో అపార అనుభవం ఉంది. పెద్ద ఆర్డర్లను పూర్తి చేయడంతో ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ఆదాయం 108 శాతం మేర పెరిగింది. సుమారు రూ.10,632 కోట్ల కాంట్రాక్టులతో ఆర్డర్‌ బుక్‌ పటిష్టంగా ఉంది. 85 శాతం మేర స్థల సమీకరణ పూర్తవడంతో.. చాలా మటుకు ప్రాజెక్టులు ప్రస్తుతం పూర్తయ్యే దశలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో 2018–20 మధ్య ఆదాయాలు 39 శాతం మేర ‡వార్షిక వృద్ధి సాధించవచ్చని అంచనా.
 
3. పీఐ ఇండస్ట్రీస్‌
ధర రూ. 857
ఎందుకంటే..?: పంటల సంరక్షణ ఉత్పత్తులను తయారు చేసే సంస్థ ఇది. దేశ, విదేశ అమ్మకాలు మెరుగ్గా ఉండటంతో 2018–19 క్యూ2లో విక్రయాలు 29 శాతం వృద్ధి చెందాయి. కొత్త ఉత్పత్తులు, సీఎస్‌ఎం వ్యాపార విభాగంలో పటిష్టమైన ఆదాయ అవకాశాలు సంస్థకు సానుకూలాంశాలు. 2018–2020 ఆర్థిక సంవత్సరాల మధ్యలో నికర లాభం 19 శాతం వృద్ధి చెందవచ్చని అంచనా. ఎగుమతులు పెరుగుతుండటం, మెరుగైన ఆర్‌అండ్‌డీ కార్యకలాపాలు, కొత్త ప్లాంట్ల రాక, పటిష్టమైన ఆర్డర్‌ బుక్‌ వంటివి ఈ షేర్‌కు సానుకూలాంశాలు.

యాక్సిస్‌ డైరెక్ట్‌ 
ఎన్నికల దాకా ఒడిదుడుకులు
ప్రస్తుత ఒడిదుడుకులు సార్వత్రిక ఎన్నికల దాకా కొనసాగే అవకాశాలున్నాయి.ఫెడ్‌ నిర్ణయాలు, వాణిజ్యయుద్ధం, క్రూడ్‌ ధరలు, ద్రవ్యోల్బణం, ఆర్‌బీఐ నిర్ణయాలు వంటివి ప్రభావం చూపుతాయి. గ్రామీణ ప్రాంతాల వృద్ధితో భారీ డిమాండ్‌ కొనసాగిన పక్షంలో మార్కెట్లు మరింతగా పెరగొచ్చు. ఈ నేపథ్యంలో కొత్త సంవత్సరంలో చూడతగ్గ స్టాక్స్‌ కొన్ని...

1. ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌
ప్రస్తుత ధర రూ. 1,583
టార్గెట్‌ రూ. 1,876     రాబడి: 18 శాతం
ఎందుకంటే..?: మెరుగైన మార్జిన్లు, అత్యధిక వడ్డీయేతర ఆదాయాలు, స్థిరమైన అసెట్‌ క్వాలిటీ వంటివి బ్యాంకుకు సానుకూలాంశాలు.  

2. వోల్టాస్‌     
ప్రస్తుత ధర రూ. 551
టార్గెట్‌ ధర రూ. 672      రాబడి: 22 శాతం
ఎందుకంటే..?: సుమారు మూడు నుంచి అయిదేళ్ల వ్యవధికి సంబంధించి కన్జూమర్‌ డ్యూరబుల్స్‌లో వోల్టాస్‌ మెరుగ్గా ఉంది. పటిష్టమైన నెట్‌వర్క్, విస్తృతమైన ఉత్పత్తుల శ్రేణి, మెరుగైన ఆర్డర్‌ బుక్‌ సానుకూలాంశాలు.

3. స్టెరిలైట్‌ టెక్నాలజీస్‌     
ప్రస్తుత ధర రూ. 289
టార్గెట్‌ ధర రూ. 410     రాబడి: 41 శాతం
ఎందుకంటే..?: ఆప్టికల్‌ ఫైబర్‌ కేబుల్‌ తదితర ఉత్పత్తుల సరఫరాదారు స్థాయి నుంచి డేటా నెట్‌వర్క్‌ సొల్యూషన్స్‌ అందించే సంస్థగా రూపాంతరం చెందుతుండటం కంపెనీకి సానుకూలాంశం. మిలిటరీ, ఏరోస్పేస్, హెల్త్‌కేర్‌ వంటి విభాగాల నుంచి కూడా ఉత్పత్తులకు డిమాండ్‌ పెరుగుతుండటం కంపెనీకి లాభించనుంది. సంస్థకు దేశీయంగా 40 శాతం, అంతర్జాతీయంగా 10 శాతం మార్కెట్‌ వాటా ఉంది. దాదాపు రూ. 6,000 కోట్ల ఆర్డర్లు చేతిలో ఉన్నాయి.

4. ఆర్తి  ఇండస్ట్రీస్‌
ప్రస్తుత ధర రూ. 1,421  టార్గెట్‌ ధర రూ. 1,740 రాబడి 22 శాతం
ఎందుకంటే..?: ఉత్పత్తి సామర్ధ్య విస్తరణ, డిమాండ్‌ వృద్దితో ఆదాయాలు మెరుగుపడగలవు. కొత్త టాలీన్‌ వ్యాపారం వచ్చే రెండు, మూడేళ్లలో గరిష్ట స్థాయిలో రాబడులివ్వొచ్చు.

5. టేక్‌ సొల్యూషన్స్‌  
ప్రస్తుత ధర రూ. 149   టార్గెట్‌ ధర రూ. 178   రాబడి 19 శాతం
ఎందుకంటే..?: భారీ మార్కెట్‌ లభ్యత, టీఎస్‌ఎల్‌ విభాగంలో అపార అనుభవం, కార్యకలాపాల విస్తరణపై ప్రధానంగా దృష్టి పెట్టడంతో ఆదాయాలు మెరుగుపడగలవు.

6. మారికో
ప్రస్తుత ధర రూ. 378         టార్గెట్‌ ధర రూ. 428
రాబడి    12 శాతం
ఎందుకంటే..?: కొబ్బరి ధరలు తగ్గనుండటం (గడిచిన పది నెలల్లో కేజీకి రూ. 90 పలికిన రేటు.. 30 శాతం తగ్గొచ్చని అంచనా) సంస్థకు సానుకూలం. ప్రధాన బ్రాండ్స్, అంతర్జాతీయ మార్కెట్లలో పనితీరు మెరుగ్గా ఉండటం.. ప్రయోజనకరం.  

7. అంబర్‌ ఎంటర్‌ప్రైజెస్‌
ప్రస్తుత ధర రూ. 912      టార్గెట్‌ రూ. 1,106  రాబడి 21 శాతం
ఎందుకంటే..?: రూమ్‌ ఎయిర్‌ కండీషనర్స్‌ (ఆర్‌ఏసీ) పరిశ్రమలోని ప్రధాన కంపెనీల్లో అంబర్‌ కూడా ఒకటి. ఇటీవల ఇతర కంపెనీల కొనుగోలుతో ఇన్వర్టర్‌ ఆర్‌ఏసీ విభాగాన్ని పటిష్టపర్చుకుంది. బ్రాండ్‌ ఓనర్లు అవుట్‌సోర్సింగ్‌ చేసే ధోరణి పెరుగుతుంటం కంపెనీకి లాభించే అంశం.

హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌
బ్యాంకింగ్, ఎఫ్‌ఎంసీజీ సానుకూలం..
1. ఏసీసీ     ప్రస్తుత ధర రూ. 1,478
ఎందుకంటే..?: ఉత్పత్తి సామర్ధ్య వినియోగం పదేళ్ల గరిష్ట స్థాయికి చేరింది. చాలా ప్రాంతాల్లో సిమెంటు రేట్లు మెరుగుపడ్డాయి. కొంగొత్త ప్రీమియం ఉత్పత్తులు, మెరుగైన ధర అంచనాలు, కార్యకలాపాల విస్తరణ, తక్కువ వేల్యుయేషన్‌లో లభిస్తుండటం దీనికి సానుకూలాంశాలు.  

2. యాక్సిస్‌ బ్యాంక్‌    ప్రస్తుత ధర రూ. 625
ఎందుకంటే..?: రెండేళ్ల పాటు 17 శాతం  అసెట్‌ వృద్ధి సాధనకు సరిపడేంతగా మూలధన నిల్వలున్నాయి. తదుపరి వృద్ధికి అవకాశమిచ్చే సాధనాల్లో గణనీయంగా ఇన్వెస్ట్‌ చేసింది. కొత్తగా మరిన్ని మొండిబాకీలు తలెత్తకుండా ఉండటంతో పాటు రుణ వ్యయాలు తగ్గుతుండటం మూలంగా ఆదాయాలు ద్వితీయార్ధంలో మెరుగుపడే అవకాశాలున్నాయి. ఇక, టాప్‌ మేనేజ్‌మెంట్‌ మారడంతో స్టాక్‌ రీరేటింగ్‌ జరగొచ్చు. ప్రస్తుతం షేరు ఆకర్షణీయ వేల్యుయేషన్స్‌లో లభిస్తోంది.

3. ఐటీసీ     ప్రస్తుత ధర రూ. 282
ఎందుకంటే..?: ఈ షేరు అవుట్‌పెర్ఫార్మ్‌ చేయడానికి అయిదు కారణాలు కనిపిస్తున్నాయి. 1) మూడింట రెండొంతుల మంది స్మోకర్స్‌ గ్రామీణ ప్రాంతాల్లోనే ఉండటం, వీరు బీడీల నుంచి అప్‌గ్రేడ్‌ అవుతుండటం. 2) పన్నుల విధానం స్థిరంగా ఉంటుందన్న అంచనాలు 3) సానుకూలమైన బేస్‌ 4) అక్రమ వ్యాపారాలను కట్టడి చేయడం 5) ఎఫ్‌ఎంసీజీ వ్యాపార వాటా పెరుగుతుండటం. ఈ అంశాల కారణంగా ఈ ఆర్థిక సంవత్సరం నుంచి 2021 దాకా మెరుగైన రాబడులు రావొచ్చు. ప్రస్తుతం ఈ రంగంలో మిగతా వాటితో పోలిస్తే 35 శాతం డిస్కౌంట్‌తో ట్రేడవుతోంది.

4. ముత్తూట్‌ ఫైనాన్స్‌
ప్రస్తుత ధర రూ. 504
ఎందుకంటే..?: గోల్డ్‌ లోన్‌ సెగ్మెంట్‌లో దీర్ఘకాలికంగా కార్యకలాపాలు, మంచి అనుభవం ఉండటం దీనికి సానుకూలాంశం. బంగారంయేతర రుణాల వాటా పెరుగుతుండటంతో.. పోర్ట్‌ఫోలియోకు రిస్కులు తగ్గుతున్నాయి. ఇతరత్రా పథకాలను విక్రయించడానికి ప్రస్తుతం ఉన్న అసెట్స్‌నే ఉపయోగించుకునేందుకు వీలుండటంతో.. ఆదాయాలతో పోలిస్తే వ్యయాలు తక్కువగా ఉండొచ్చు. పసిడి రుణాల విభాగం పునర్‌వ్యవస్థీకరణ కారణంగా రాబోయే రోజుల్లో మొండిబాకీల స్థాయి తగ్గుతుంది.

5. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌
ప్రస్తుత ధర రూ. 1,125
ఎందుకంటే..?: కన్జూమర్, టెలికం సెగ్మెంట్‌ విస్తరించే కొద్దీ కంపెనీ ఆదాయాలు గణనీయంగా వృద్ధి చెందనున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం నుంచి 2021 దాకా టెలికం విభాగం ఆర్‌జియో ఆదాయం 27 శాతం మేర, లాభాలు 77 శాతం మేర వృద్ధి నమోదు చేయొచ్చని అంచనా. 2021 ఆర్థిక సంవత్సరం ఆఖరు నాటికి రిలయన్స్‌ జియో సబ్‌స్క్రయిబర్స్‌ సంఖ్య 41 కోట్లకు చేరొచ్చు.

జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌
వినియోగ వస్తువులు, ఐటీ స్టాక్స్‌ బెస్ట్‌
రాష్ట్రాల ఎన్నికలు, ఆర్‌బీఐ గందరగోళం, చమురు ధరల పతనం, తగ్గిన ద్రవ్యోల్బణం, వాణిజ్య లోటు తగ్గుముఖం పట్టడం, పారిశ్రామికోత్పత్తి గణాంకాలు మెరుగ్గా ఉండటం వంటివి డిసెంబర్‌లో స్టాక్‌ మార్కెట్లు హెచ్చు తగ్గులకు కారణమయ్యాయి. నిఫ్టీ 6 శాతం శ్రేణిలో తిరిగింది. రైతు రుణ మాఫీలు, జీఎస్‌టీ రేట్ల కోత మొదలైన పరిణామాలన్నీ మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. అధిక వినియోగం ద్వారా ఎకానమీకి ఇవి సానుకూలమైనవే అయినప్పటికీ.. సమీప భవిష్యత్‌లో ఈ ప్రజాకర్షక పథకాలతో దేశ ఆర్థిక విధానాలపై ప్రతికూల ప్రభావాలు పడవచ్చు. ఇప్పటికే వృద్ధి మందగించడం, వచ్చే 6 నెలల్లో మరింత నెమ్మదించనుండటంతో.. ఈ రిస్కులు మరింత పెరుగుతాయి. ఈ పరిస్థితుల్లో కొత్త ఏడాది ఐటీ కంపెనీలు సానుకూలంగా కనిపిస్తున్నాయి. వీటితో పాటు ఎఫ్‌ఎంసీజీ, వ్యవసాయ రంగాల షేర్లూ ఆకర్షణీయమే.  

సిఫార్సులు
1. ఎక్సైడ్‌ ఇండస్ట్రీస్‌     ప్రస్తుత ధర రూ. 265
ఎందుకంటే..?: స్టోరేజీ బ్యాటరీ వ్యాపారంలో దేశీయంగా 60 శాతం మార్కెట్‌ వాటాతో ఎక్సైడ్‌.. లీడర్‌ స్థానంలో ఉంది. క్యూ2లో అధిక ఇంధన ధరలు, రూపాయి పతనంతో ఎబిటా 30 బేసిస్‌ పాయింట్ల మేర క్షీణించింది. అయితే.. బ్యాటరీ ఇంజినీరింగ్‌ ఆమోదయోగ్యత పెరుగుతుండటం వంటి అంశాల వల్ల ఎక్సైడ్‌ దీర్ఘకాలిక అంచనాలు సానుకూలంగా ఉన్నాయి. 2018–2020 ఆర్థిక సంవత్సరాల మధ్య ఆదాయాలు, నికర లాభం 15–16 శాతం మేర వృద్ధి చెందే అవకాశం ఉంది.
 
2. పీఎన్‌సీ ఇన్‌ఫ్రాటెక్‌
ప్రస్తుత ధర రూ. 148
ఎందుకంటే..?: ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ నిర్మాణ, అభివృద్ధి, నిర్వహణ రంగ కంపెనీ ఇది. హైవేలు, వంతెనలు, ఎయిర్‌పోర్ట్‌ రన్‌వేల నిర్మాణంలో అపార అనుభవం ఉంది. పెద్ద ఆర్డర్లను పూర్తి చేయడంతో ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ఆదాయం 108 శాతం మేర పెరిగింది. సుమారు రూ.10,632 కోట్ల కాంట్రాక్టులతో ఆర్డర్‌ బుక్‌ పటిష్టంగా ఉంది. 85 శాతం మేర స్థల సమీకరణ పూర్తవడంతో.. చాలా మటుకు ప్రాజెక్టులు ప్రస్తుతం పూర్తయ్యే దశలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో 2018–20 మధ్య ఆదాయాలు 39 శాతం మేర ‡వార్షిక వృద్ధి సాధించవచ్చని అంచనా.
 
3. పీఐ ఇండస్ట్రీస్‌
ధర రూ. 857
ఎందుకంటే..?: పంటల సంరక్షణ ఉత్పత్తులను తయారు చేసే సంస్థ ఇది. దేశ, విదేశ అమ్మకాలు మెరుగ్గా ఉండటంతో 2018–19 క్యూ2లో విక్రయాలు 29 శాతం వృద్ధి చెందాయి. కొత్త ఉత్పత్తులు, సీఎస్‌ఎం వ్యాపార విభాగంలో పటిష్టమైన ఆదాయ అవకాశాలు సంస్థకు సానుకూలాంశాలు. 2018–2020 ఆర్థిక సంవత్సరాల మధ్యలో నికర లాభం 19 శాతం వృద్ధి చెందవచ్చని అంచనా. ఎగుమతులు పెరుగుతుండటం, మెరుగైన ఆర్‌అండ్‌డీ కార్యకలాపాలు, కొత్త ప్లాంట్ల రాక, పటిష్టమైన ఆర్డర్‌ బుక్‌ వంటివి ఈ షేర్‌కు సానుకూలాంశాలు.
– సాక్షి, బిజినెస్‌ విభాగం

గమనిక: ఇవన్నీ బ్రోకరేజి సంస్థల సిఫార్సులు మాత్రమే. రిస్కులను బేరీజు వేసుకుని ఇన్వెస్టర్లు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top