రాజకీయ ప్రయోజనాలకే విభజన | YSRCP MLC Meka Seshu Babu opposes state division | Sakshi
Sakshi News home page

రాజకీయ ప్రయోజనాలకే విభజన

Jan 23 2014 5:03 AM | Updated on Sep 27 2018 5:59 PM

ప్రజాప్రయోజనాలను కాదని రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర విభజన నిర్ణయం తీసుకోవడం దుర్మార్గమైన చర్య అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు విమర్శించారు.

 ప్రజాప్రయోజనాలను కాదని రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర విభజన నిర్ణయం తీసుకోవడం దుర్మార్గమైన చర్య అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు విమర్శించారు. రాష్ట్ర విభజనకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకమని, తక్షణమే సభలో సమైక్య తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. బుధవారం శాసనమండలిలో ఆయన మాట్లాడారు. విభజన జరిగితే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ, 108, 104, ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి పథకాలు ఆగిపోయే ప్రమాదముందని, దీని వల్ల పేదలు తీవ్ర ఇబ్బందులు పడతారన్నారు. 75 శాతం మంది ప్రజలు సమైక్యాంధ్రను కోరుకుంటున్నారని, ప్రజల మనోభావాలను కాదని సోనియా రాష్ట్రాన్ని విభజించడానికి పూనుకోవడం దురదృష్టకరమని అన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement