పంపుహౌస్ ముట్టడి : ఎమ్మెల్యే అరెస్ట్ | ysrcp mla visweswara reddy arrest over pump house Obsession | Sakshi
Sakshi News home page

పంపుహౌస్ ముట్టడి : ఎమ్మెల్యే అరెస్ట్

Aug 29 2016 1:51 PM | Updated on Oct 30 2018 5:12 PM

పంపుహౌస్ ముట్టడి : ఎమ్మెల్యే అరెస్ట్ - Sakshi

పంపుహౌస్ ముట్టడి : ఎమ్మెల్యే అరెస్ట్

ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి నేతృత్వంలో రైతులు పంపుహౌస్ కార్యాలయాన్ని ముట్టడించారు.

అనంతపురం : కరువు ప్రాంతాలను సీఎం చంద్రబాబు పట్టించుకోవడం లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి ఆరోపించారు. ఎమ్మెల్యే నేతృత్వంలో సోమవారం రైతులు రాగులపాడు పంపుహౌస్ కార్యాలయాన్ని ముట్టడించారు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డితో సహా పలువురు రైతులను అరెస్ట్ చేశారు. 
 
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ...హంద్రీనీవా మొదటి దశ వైఎస్ఆర్ హయాంలోనే పూర్తయినా..ఇప్పటి వరకు పంటపొలాలకు నీరు విడుదల చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే హంద్రీనీవాకు నీరు విడుదల చేసి రైతులను ఆదుకోవాలని విశ్వేశ్వరరెడ్డి డిమాండ్ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement