రైల్వే కోడూరులో వరద బాధితులను వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు, జిల్లా అధ్యక్షుడు అమర్నాథ్రెడ్డి మంగళవారం పరామర్శించారు.
వైఎస్సార్ జిల్లా: రైల్వే కోడూరులో వరద బాధితులను వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు, జిల్లా అధ్యక్షుడు అమర్నాథ్రెడ్డి మంగళవారం పరామర్శించారు. రైల్వే కోడూరులో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో వేల ఎకరాల్లో పంటలు ధ్వంసమయ్యాయి. ధర్మాపురం, గాండ్లవీధిలో వరద బాధితులను నాయకులు పరామర్శించారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వరద పరిస్థితులపై అమరనాథ్రెడ్డితో ఫోన్లో మాట్లాడిన విషయం తెలిసిందే.