వైఎస్ఆర్ సీపీ నేత దారుణ హత్య | ysrcp leader vasanthrao brutally murdered in adilabad distirict | Sakshi
Sakshi News home page

వైఎస్ఆర్ సీపీ నేత దారుణ హత్య

May 15 2015 9:24 AM | Updated on May 29 2018 2:48 PM

కర్నూలు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వసంతరావు(55) దారుణ హత్యకు గురయ్యారు.

కర్నూలు: కర్నూలు జిల్లాలో వైఎస్ఆర్  కాంగ్రెస్ పార్టీ నేత వసంతరావు(55) దారుణ హత్యకు గురయ్యారు. పాత కక్ష్యల నేపథ్యంలో గుర్తుతెలియని దుండగులు  ఆయనపై దాడి చేసి హతమార్చారు. ఈ సంఘటన శుక్రవారం మహబూబ్‌నగర్ జిల్లాలోని శ్రీశైలం రెండో జలవిద్యుత్ కేంద్రం వద్ద జరిగింది. వివరాల్లోకి వెళితేసున్నిపెంట మండల కేంద్రానికి చెందిన వసంతరావు ఈరోజు తెల్లవారుజామున హైదరాబాద్‌కు పని నిమిత్తం బయలుదేరారు.

ఈ క్రమంలోనే మార్గ మధ్యలో కొంతమంది దుండగులు ఆయన కారుపై రాళ్ల వర్షం కురిపించి, అనంతరం వేటకొడవళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో వసంతరావు అక్కడికక్కడనే మృతి చెందారు. స్థానికుల సమాచారంతో మహబూబ్‌నగర్ జిల్లా అమ్రాబాద్ మండల పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసి దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.


(సున్నిపెంట)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement