సమైక్య తీర్మానానికే వైఎస్ఆర్‌సీపీ పట్టు | YSRCP demands council resolution on united Andhra Pradesh, says jupudi prabhakar | Sakshi
Sakshi News home page

సమైక్య తీర్మానానికే వైఎస్ఆర్‌సీపీ పట్టు

Dec 17 2013 2:03 PM | Updated on May 25 2018 9:12 PM

ఓటింగ్‌, చర్చ, బిల్లు కన్న ముందు సమైక్య తీర్మానానికే వైఎస్ఆర్‌సీపీ పట్టుబడుతుందని ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్‌ స్పష్టం చేశారు.

హైదరాబాద్ : ఓటింగ్‌, చర్చ, బిల్లు కన్న ముందు సమైక్య తీర్మానానికే వైఎస్ఆర్‌సీపీ పట్టుబడుతుందని ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్‌ స్పష్టం చేశారు. సమైక్య తీర్మానం చేసి చర్చించాలని ఆయన డిమాండ్‌ చేశారు. సభలో అభిప్రాయాలు తీసుకోవాలని సూచించారు. తాము చెప్పినదాన్ని ఒప్పుకోకుండా బీఏసీ చెప్పినదాన్నే ఒప్పుకోమంటే దాన్ని వైఎస్ఆర్‌సీపీ ఖండిస్తుందన్నారు. మరోవైపు శాసనమండలి బీఏసీ సమావేశంలో తెలంగాణ బిల్లుపై చర్చించే అంశంపై ఏకాభిప్రాయం కుదరలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement