ఆగ్రహ జ్వాల | YSR Seepee under the 72-hour bandh | Sakshi
Sakshi News home page

ఆగ్రహ జ్వాల

Oct 5 2013 3:19 AM | Updated on Aug 8 2018 5:45 PM

జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో వైఎస్‌ఆర్ కాం గ్రెస్ పార్టీ నాయకులు బంద్ చేపట్టారు. పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు 72 గంటల పాటు చేప డుతున్నారు.

సాక్షి, తిరుపతి: జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో వైఎస్‌ఆర్ కాం గ్రెస్ పార్టీ నాయకులు బంద్ చేపట్టారు. పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు 72 గంటల పాటు చేప డుతున్నారు. ఇందులో భాగంగా మొదటి రోజు శుక్రవారం  కా ర్యక్రమం విజయవంతమైంది.  పలుచోట్ల రహదారులను దిగ్బం ధం చేశారు. వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. సోనియా గాంధీ దిష్టిబొమ్మలను దహనం చేశారు.  తిరుపతిలో ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి నేతృత్వంలోఉదయం 8.00 గంటలకు తెలుగుతల్లి విగ్రహం వద్ద రాస్తారోకో నిర్వహించారు.

తిరుపతిలో బంద్ కూడా జరిగింది. తిరిగి మధ్యాహ్నం 2.30 గంటలకు తిరుమల బైపాస్ రోడ్డులో టీఎంఆర్ కల్యాణ మండపం వద్ద రోడ్డుపై బైఠాయించి, రాస్తారోకో నిర్వహించారు. నగిరి నియోజకవర్గం పరిధిలోని పుత్తూరులో పార్టీ జిల్లా కన్వీనర్ నారాయణ స్వామి రాస్తారోకో, బంద్ నిర్వహించారు. నగరిలో కెజె కుమా    ర్, కుమారస్వామి  నాయకత్వంలో సోనియా దిష్టిబొమ్మను ద హనం చేశారు. వడమాలపేటలో నిరసన ప్రదర్శన చేపట్టారు. నిండ్రలో శ్యామ్‌లాల్ అధ్వర్యంలో జాతీయరహదారిని దిగ్బం దం చేశారు.

విజయపురంలో మానవహారం ఏర్పాటుచేశారు. శ్రీకాళహస్తిలో బియ్యపు మధుసూదన్‌రెడ్డి అధ్వర్యంలో స్కూటర్ ర్యాలీ నిర్వహించారు. దీక్ష శిబిరాల వద్ద నిరాహారదీక్ష చేస్తున్న వివిధ జేఏసీ నాయకులకు సంఘీభావం ప్రకటించారు. పూతలపట్టులో బంద్‌ను ప్రశాంతంగా నిర్వహించారు. రోడ్డుపై బైఠాయించి వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. జిల్లా అధికార ప్రతినిధి తలుపులపల్లి బాబురెడ్డి, సమన్వయకర్తలు పూర్ణం, రవికుమార్, మండలకన్వీనరు రాజరత్నంరెడ్డి పాల్గొన్నారు. చిత్తూరులో నియోజకవర్గ  సమన్వయకర్త ఎఎస్.మనోహర్ ఆ ధ్వర్యంలో బంద్ నిర్వహించారు. బంద్ పరిస్థితి గురించి స్కూ టర్ ర్యాలీ ద్వారా తెలుసుకున్నారు.

తరువాత ఎంఎస్‌ఆర్ స ర్కిల్ వద్ద రాస్తారోకో నిర్వహించారు. పార్టీ మహిళా జిల్లా అ ధ్యక్షురాలు గాయిత్రీదేవి పాత కలెక్టరు కార్యాలయం నుంచి ర్యాలీ నిర్వహించి, గాంధీబొమ్మ దగ్గర సోనియా దిష్టిబొమ్మను దహనం చేశారు. పలమనేరులో బైక్ ర్యాలీలు, రాస్తారోకో, జా తీయ రహదారుల దిగ్బంధం చేశారు. పార్టీ సమన్వయకర్త అమరనాథరెడ్డి వి.కోట, బెరైడ్డిపల్లె మండలాల్లో స్వయంగా పాల్గొన్నారు. కుప్పం, పీలేరులలో పార్టీ కార్యకర్తలు బంద్ నిర్వహిం చారు. సత్యవేడులో సమన్వయకర్త ఆదిమూలం నాయకత్వంలో గాంధీ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చే శారు, తరువాత ర్యాలీ చేసి, బంద్ నిర్వహించారు.

మదనపల్లెలో ఎమ్మెల్సీ దేశాయి తిప్పారెడ్డి సీటిఎం రోడ్డు నుంచి బెంగుళూరు బస్టాండు వరకు ర్యాలీ నిర్వహించారు.  మూడు రోజులుగా దీక్ష చేపట్టిన సమన్వయకర్త షమీమ్ ఇస్లాం కూడా ర్యాలీ చేపట్టారు.  పార్టీ యువజన నేత ఉదయకుమార్  సోనియా దిష్టిబొమ్మను దగ్దం చేశారు. పుంగనూరులో పార్టీ నాయకులు రెడ్డెప్ప రెడ్డి, నాగభూషణం, వెంకటరెడ్డి తదితరుల అధ్వర్యంలో బంద్ చేపట్టారు. తరువాత ప్రధాన కూడలి వద్ద ధర్నాచేసి, జాతీయ రహదారిపై బైఠాయించారు. సోనియా, చిదంబరం, కిరణ్‌కుమార్ రెడ్డి, కేసీఆర్, దిగ్విజయ్‌సింగ్ ఫ్లెక్సీలను తగులబెట్టారు.  

చంద్రగిరిలో నాగయ్యగారి పల్లి వద్ద రోడ్డుదిగ్బంధం చేశారు. తిరుపతి, మదనపల్లి రహదారిలో మంటలు వేశారు. దీంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.  చంద్రగిరిలో కోటాల చంద్రశేఖర్ రెడ్డి నాయకత్వంలో బంద్ నిర్వహించారు. తంబళ్లపల్లిలో వైఎస్‌ఆర్ సీపీ కార్యకర్తలు బంద్ నిర్వహించారు. ములకల చెరువులో మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్‌కుమార్ రెడ్డి నిరాహారదీక్ష చేపట్టారు.  గంగాధరనెల్లూరులో మధ్యాహ్నం వరకు బంద్ చేపట్టారు. మండలకన్వీనర్ల నాయకత్వంలో ర్యాలీ, ధర్నా చేపట్టారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement