అక్రమ కట్టడాలను కూల్చేస్తున్న రెవెన్యూ అధికారులు

In YSR District Revenue Officials Collapse Illegal Construction - Sakshi

సాక్షి, వైఎస్సార్‌: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు అక్రమ కట్టడాలపై కొరడా జులిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో గురువారం జిల్లాలోని చక్రాయపేట మండలం ఉప్పల వాండ్ల పల్లే గ్రామం ఉప్పల కుంట చెరువులో టీడీపీకి చెందిన వ్యక్తి అక్రమంగా నిర్మించిన ఇంటిని కూల్చేశారు. ఈ క్రమంలో గ్రామంలో ఎలాంటి ఘర్షణలు తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యగా భారీగా పోలీసులను మోహరించారు. చెరువులో ఎలాంటి అక్రమ నిర్మాణాలు చేపట్టరాదనే నిబంధనల మేరకే ఇంటిని కూల్చేశామని అధికారులు స్పష్టం చేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top