‘వైఎస్‌ పథకాలు దేశానికే స్ఫూర్తిదాయకం’

YS Rajasekhara Reddy Birth Anniversary Celebrations In Anantapur - Sakshi

సాక్షి, అనంతపురం : దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి గొప్ప దార్శనికుడని, ఆ మహానేత ప్రవేశపెట్టిన పథకాలు దేశానికే స్ఫూర్తిదాయకమని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వర్‌ రెడ్డి అన్నారు. నేడు వైఎస్‌ జయంతి సందర్భంగా మహానేతకు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మాజీ ఎంపీ అనంత వెంకట్రామి రెడ్డి మాట్లాడుతూ.. రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలను అమలు చేసిన ఘనత వైఎస్సార్‌దేనని అన్నారు. వైఎస్‌ జగన్‌ సీఎం అయితే మళ్లీ రాజన్నయుగం వస్తుందని చెప్పారు. వైఎస్సార్‌ ఆశయాలు సాధించేందుకు ప్రతిఒక్కరూ నడుం బిగించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top