జీఎస్టీ నుంచి చేనేతను మినహాయించండి | YS Jagan Mohan Reddy letter to arun jaitley over GST | Sakshi
Sakshi News home page

జీఎస్టీ నుంచి చేనేతను మినహాయించండి

Jun 24 2017 12:50 AM | Updated on Jul 25 2018 4:42 PM

జీఎస్టీ నుంచి చేనేతను మినహాయించండి - Sakshi

జీఎస్టీ నుంచి చేనేతను మినహాయించండి

వస్తు సేవల పన్ను(జీఎస్టీ) నుంచి చేనేత రంగాన్ని మినహాయించాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి కోరారు.

- వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విజ్ఞప్తి 
కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీకి లేఖ 
 
సాక్షి, విజయవాడ: వస్తు సేవల పన్ను(జీఎస్టీ) నుంచి చేనేత రంగాన్ని మినహాయించాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి కోరారు. ఆ మేరకు ఆయన  కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీకి శుక్రవారం లేఖ రాశారు. చేనేత రంగాన్ని ఆదుకునేందుకు వీలుగా కేంద్రం ఈ వస్త్రాలకు జీఎస్టీ నుంచి మినహా యింపు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. భారత్‌లో వ్యవసాయం రంగం తర్వాత చేనేత రంగంపైనే ఎక్కువ మంది ఆధారపడ్డారని గుర్తుచేశారు. టెక్స్‌టైల్స్‌ ఇండస్ట్రీ ద్వారా ప్రత్యక్షంగా నాలుగున్నర కోట్లు, పరోక్షంగా ఆరు కోట్ల మంది ఉపాధి పొందుతున్నారని పేర్కొన్నారు.

చేనేత రంగంపై జీఎస్టీ భారం వేస్తే... ఆ ప్రభావం కార్మికులందరిపైనా పడుతుంద న్నారు. జీఎస్టీ వల్ల వస్త్ర దుకా ణాలను మూసివేయాల్సిన పరిస్థితి వస్తుందని వ్యాపారుల్లో ఆందోళన నెల కొందన్నారు. కేవలం మూడు, నాలుగు శాతం లాభాలతో అమ్ముకునే వ్యాపా రులపై జీఎస్టీ వల్ల అధిక శాతం పన్ను పడుతోందన్నారు. పెరిగిన రసాయనాలు, నూలు ధరలతో ఇప్పటికే కొన ఊపిరితో ఉన్న చేనేత రంగం జీఎస్టీ పన్నులతో పూర్తిగా కనుమరుగు అవు తుందన్నారు. జీఎస్టీ నుంచి మినహాయింపు ఇస్తే ఉత్పత్తులు మరింత పెరిగే వీలుందని, కార్మికులకు ఊరట కలుగుతుందని జగన్‌ తన లేఖలో నివేదిం చారు. వైఎస్‌ జగన్‌ రాసిన లేఖను వైఎస్సార్‌సీపీ చేనేత విభాగం రాష్ట్ర అధ్యక్షుడు చిల్లపల్లి మోహన్‌రావు విజయవాడలో మీడియాకు విడుదల చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement