ఎమ్మెల్యేలతో వైఎస్ జగన్ బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ | YS jagan mohan reddy breakfast meeting with party mlas | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యేలతో వైఎస్ జగన్ బ్రేక్ ఫాస్ట్ మీటింగ్

Jun 19 2014 9:05 AM | Updated on Jul 25 2018 4:09 PM

ఎమ్మెల్యేలతో వైఎస్ జగన్ బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ - Sakshi

ఎమ్మెల్యేలతో వైఎస్ జగన్ బ్రేక్ ఫాస్ట్ మీటింగ్

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ ఎమ్మెల్యేలతో బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ ఏర్పాటు చేశారు.

హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ ఎమ్మెల్యేలతో బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఉదయం తొమ్మిది గంటలకు ఆయన లోటస్ పాండ్లో పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చలు జరుపుతున్నారు.

 

మరోవైపు ఉదయం పది గంటలకు పంజాగుట్టలోని వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం వద్ద నివాళులు అర్పించి అనంతరం అసెంబ్లీ సమావేశాలకు బయల్దేరనున్నారు. ఉదయం 11 గంటలకు అసెంబ్లీ ఆవరణలోని మహాత్మా గాంధీ, అంబేద్కర్ విగ్రహాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు నివాళులు అర్పించనున్నారు.  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు లోటస్ పాండ్ నుంచి  అసెంబ్లీకి బస్సులో రానున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement