10న వైఎస్సార్‌ కంటి వెలుగు ప్రారంభించనున్న సీఎం జగన్‌

YS Jagan To Launch YSR Kanti Velugu Scheme On October 10th In Anatapur - Sakshi

అనంతపురంలో ప్రారంభించనున్న సీఎం జగన్‌

సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ట్మాతకంగా చేపట్టనున్న ‘వైఎస్సార్‌ కంటి వెలుగు’ కార్యక్రమాన్ని గురువారం(10వ తేదీన) ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించనున్నారు. అనంతపురం జూనియర్‌ కాలేజ్‌ గ్రౌండ్స్‌లో జరిగే సభలో పాల్గొననున్న సీఎం వైఎస్‌ జగన్‌ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. ప్రపంచ దృష్టి దినోత్సవం సందర్భంగా ప్రజలందరికీ వైఎస్సార్‌ కంటి వెలుగు కింద ఉచితంగా కంటి పరీక్షలు, శస్త్రచికిత్సలు లభించనున్నాయి. 6 విడతలుగా మూడేళ్లపాటు ఈ కార్యక్రమం అమలు కానుంది.

బుధవారం రాజమండ్రికి సీఎం వైఎస్‌ జగన్‌
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం ఉదయం రాజమండ్రి వెళ్లనున్నారు. వైఎస్సార్‌సీపీ నేత శివరామసుబ్రహ్మణ్యం కుమార్తె విహహ వేడుకకు సీఎం జగన్‌ హాజరుకానున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top