మస్తాన్బాబు కుటుంబాన్ని ఓదార్చిన వైఎస్ జగన్ | ys jagan Condolence to late mountaneer mastan babu' mother | Sakshi
Sakshi News home page

మస్తాన్బాబు కుటుంబాన్ని ఓదార్చిన వైఎస్ జగన్

Apr 14 2015 2:49 PM | Updated on Jul 25 2018 4:09 PM

మస్తాన్బాబు కుటుంబాన్ని ఓదార్చిన వైఎస్ జగన్ - Sakshi

మస్తాన్బాబు కుటుంబాన్ని ఓదార్చిన వైఎస్ జగన్

పర్వతారోహకుడు, ఇటీవలే అర్జెంటీనాలో మృతిచెందిన తెలుగుతేజం మల్లి మస్తాన్ బాబు కుటుంబాన్ని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరామర్శించారు.

పర్వతారోహకుడు, ఇటీవలే అర్జెంటీనాలో మృతిచెందిన తెలుగుతేజం మల్లి మస్తాన్ బాబు కుటుంబాన్ని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరామర్శించారు. మంగళవారం నెల్లూరు జిల్లా గాంధీసంగంకు చేరుకున్న ఆయన.. మస్తాన్ బాబు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. మస్తాన్ బాబు తల్లి సుబ్బమ్మ సహా ఇతర కుటుంబ సభ్యులను  ఓదార్చారు.

వైఎస్సార్సీపీ నేతలు మేకపాటి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి తదితరులు మస్తాన్ బాబు కుటుంబాన్ని పరామర్శించినవారిలో ఉన్నారు. పర్వాతారోహణలో గిన్నిస్ రికార్డును సొంతం చేసుకున్న మస్తాన్ బాబు.. కొద్ది రోజుల క్రితం ఆండీస్ పర్వతశ్రేణుల్లో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన మృతదేహం స్వస్థలానికి రావాల్సిఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement