కిరణ్‌ కుటుంబానికి రూ.10 లక్షలు పరిహారం

YS Jagan Annonces Ten Lakhs To Prakasham Scheduled Caste Person Deceased - Sakshi

సాక్షి, ప్రకాశం: చీరాల ఎస్సై విజయకుమార్‌ దాడి చేసిన ఘటనలో కిరణ్‌ అనే దళిత యువకుడు గుంటూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. ఈ నెల 19న బైకుపై వస్తూ మాస్క్‌​ ధరించలేదని ఆగ్రహించిన ఎస్సై విజయకుమార్‌ లాఠీతో కిరణ్‌ను చితకబాదాడు. దీంతో అతడిని ఎస్సై సిబ్బందితో చికిత్స నిమిత్తం చీరాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై పూర్తి వివరాలను సేకరించాని జిల్లా ఎస్పీని ముఖ్యమంత్రి కార్యాలయం ఆదేశించింది. ఈ ఘటనపై స్పందించిన సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మరణించిన కిరణ్‌ కుటుంబానికి రూ.10 లక్షలు పరిహారం ప్రకటించారు. ఈ ఘటనపై ఉన్నత స్థాయి అధికారులుతో విచారణ జరపాలని సీఎం ఆదేశించారు.
 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top