283వ రోజు ప్రారంభమైన ప్రజాసంకల్పయాత్ర

YS Jagan 283rd Day PrajasankalpaYatra Has Started On 10Th October - Sakshi

సాక్షి, గజపతినగరం :  వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విజయనగరం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. బుధవారం ఉదయం 283వ రోజు పాదయాత్ర జిన్నాం నుంచి ప్రారంభమైంది. అడుగడుగునా ప్రజాసమస్యలు సమస్యలు తెలుసుకుంటూ వైఎస్‌ జగన్‌ ముందుకు సాగుతున్నారు.

వైఎస్‌ జగన్‌ రాకతో పాదయాత్ర సాగుతున్న మార్గంలో పండుగ వాతావారణం నెలకొంది. గజపతినగరం నియోజకవర్గంలోని లింగాల వలస, లోగిస క్రాస్‌, కొత్త శ్రీరంగ రాజపురం, నారాయణ గజపతిరాజపురం, గజపతినగరం వరకు నేడు పాదయాత్ర కొనసాగనుంది. ఈ సాయంత్రం గజపతినగరంలో జరిగే బహిరంగ సభలో వైఎస్‌ జగన్‌ పాల్గొని ప్రసంగిస్తారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top