ఓ యువకుడు మామిడితోటలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన కర్నూలు జిల్లా కోడుమూరు మండలం తేలకుర్తి గ్రామ శివారులో శుక్రవారం చోటుచేసుకుంది.
కోడుమూరు (కర్నూలు) : ఓ యువకుడు మామిడితోటలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన కర్నూలు జిల్లా కోడుమూరు మండలం తేలకుర్తి గ్రామ శివారులో శుక్రవారం చోటుచేసుకుంది. మద్దిగేర మండలం మదనంతపురం గ్రామానికి చెందిన ఎరుకలి సురేష్ అనే యువకుడు తోటలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.