‘సీఎం జగన్‌ చాలా సాదాసీదాగా ఉన్నారు’ | Xiaomi MD Manu Kumar Jain Meets CM YS Jagan Mohan Reddy | Sakshi
Sakshi News home page

‘సీఎం జగన్‌ చాలా సాదాసీదాగా ఉన్నారు’

Jul 23 2019 10:12 PM | Updated on Jul 23 2019 11:20 PM

Xiaomi MD Manu Kumar Jain Meets CM YS Jagan Mohan Reddy - Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ‍్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చాలా సాదాసీదాగా ఉన్నారని, ఆయన్ని కలవటం చాలా సంతోషంగా ఉందని షావోమి సంస్థ ఎండీ మనుకుమార్‌ జైన్‌ అన్నారు. సోమవారం సీఎం జగన్‌తో భేటీ అయిన జైన్‌ ఏపీలో తమ కంపెనీ ప్రణాళికలను ఆయనకు వివరించారు. ఈ నేపథ్యంలో మంగళవారం ట్విటర్‌ వేదికగా జైన్‌ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ‘‘ సీఎం వైఎస్‌ జగన్‌తో గొప్ప సమావేశం జరిగింది. మేకిన్‌ ఇండియా గురించి ఇద్దరి మధ్య చర్చ జరిగింది. దీనిపై మా అభిప్రాయం సీఎంతో పంచుకున్నాం. వైఎస్‌ జగన్‌ కూడా రాష్ట్ర అభివృద్ధిపై తనకున్న దార్శనికతను తెలిపారు. ఆయన ద్వారా మేం ఎంతో ప్రేరణ పొందాము’’ అని పోస్ట్‌ చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement