-
షావొమీకి మను జైన్ గుడ్బై
న్యూఢిల్లీ: స్మార్ట్ ఉపకరణాల తయారీలో ఉన్న చైనా కంపెనీ షావొమీ గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్, భారత విభాగం మాజీ అధిపతి మను కుమార్ జైన్ రాజీనామా చేశారు. తొమ్మిదేళ్లపాటు ఆయన భారత వ్యవహారాలను నిర్వహించారు. ఫెమా నిబంధనలను షావొమీ ఉల్ల -
షావోమి ఉద్యోగులకు బంపర్ ఆఫర్
సాక్షి,ముంబై: ప్రముఖ మొబైల్ తయారీదారు షావోమి ఇండియా తన ఉద్యోగులకు తీపికబురు అందించింది. హార్డ్షిప్ బోనస్కింద ఉద్యోగులకు15 రోజుల జీతాన్ని బోనస్ ప్రకటించింది. కరోనా వైరస్ మహమ్మారి సంక్షోభంలో ఇబ్బందులను ఎదుర్కొన్న కార్పొరేట్ ఉద్యోగులతోపాటు ఇతరలకు వార్షిక బిజినెస్ బోనస్కు అదనంగా ఈ బోనస్ను అందించనుంది. అలాగే తన ఉద్యోగులందరికీ కోవిడ్-19 వ్యాక్సిన్ను ఉచితంగా అందించాలని నిర్ణయించింది. కుటుంబ సభ్యులతోపాటు, ఉద్యోగులందరికీ కరోనా వ్యాక్సిన్ ఖర్చులను తామే భరిస్తామని షావోమి ఇండియా ఎండీ మనుకుమార్ జైన్ తెలిపారు. వీరందరికీ అర్హత ప్రమాణాల ప్రకారం కరోనావైరస్ వ్యాక్సిన్ తీసుకునేలా అన్ని ప్రయత్నాలు చేస్తామని చెప్పారు. ప్రస్తుతం కంపెనీ 60వేల ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగులను కలిగి ఉంది. కరోనా మహమ్మారి, లాక్డౌన్ తరువాత దేశీయ డిమాండ్ పెరగడంతో, ఎగుమతులను నిలిపివేయాలని భావిస్తున్నట్టు ఇటీవల ప్రకటించింది. స్థానిక డిమాండ్కే తమ తొలి ప్రాధాన్యమని జైన్ తెలిపారు. డిమాండ్కు అనుగుణంగా ఉత్పత్తి-అనుసంధాన ప్రోత్సాహక (పిఎల్ఐ) పథకంలో భాగంగా తన భాగస్వాములతో కలిసి దేశంలో ఉత్పత్తి సామర్థ్యాన్ని విస్తరిస్తున్నామని చెప్పారు. కాగా సీఎంఆర్ ఇండియా డేటా ప్రకారం 2020 మూడవ త్రైమాసికంలో భారతీయ స్మార్ట్ఫోన్ మార్కెట్లో టాప్లో ఉంది షావోమి. 27 శాతం మార్కెట్ వాటాతో మార్కెట్ లీడర్గా ఉంది. దేశంలో స్మార్ట్ఫోన్లతో పాటు, ఎయిర్ ప్యూరిఫైయర్లు, ఫిట్నెస్ బ్యాండ్లు, వీఆర్ హెడ్సెట్లు వర్ బ్యాంక్లను షావోమి విక్రయిస్తున్న సంగతి తెలిసిందే. -
సోనూ సూద్ నెక్ట్స్ మిషన్ ఇదే!
సాక్షి, ముంబై: నటుడు సోనూ సూద్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా, లాక్డౌన్ సమయంలో వలస కార్మికులను ఆదుకుని రియల్ హీరోగా నిలిచిన తన మిషన్ను నిరంతరాయంగా కొనసాగిస్తూనే ఉన్నారు. ఎంతోమంది ఆపన్నులను ఆదుకోవడంతోపాటు, అనేకమంది పేద విద్యార్థుల చదువులు నిలిచిపోకుండా విశేష కృషి చేశారు. ఈక్రమంలో తాజాగా స్టార్ట్ఫోన్ తయారీదారు షావోమితో జత కలిసారు. ఈ విషయాన్ని సోనూ సూద్ స్వయంగా ట్విటర్ ద్వారా వెల్లడించారు. ‘‘మనమంతా ఐక్యంగా పోరాడి మార్గం ఎంత కఠినమైనా.. ఓటమిని అంగీకరించేది లేదంటూ కలల సాకారాన్ని నిరూపించి చూపాం. ఈ క్రమంలో మరో మార్గాన్ని చేపట్టాం. మీ అందరి సాయంతో ఈ పరంపరను ఇకపై కూడా కొనసాగిద్దాం..’’ ఈ రోజునుంచి ఏ విద్యార్థి తన ఆన్లైన్ క్లాస్లను మిస్కాకూడదు అంటూ మరోసారి పునరుద్ఘాటించిన ఆయన ఒక కొత్త మిషన్ను ప్రకటించారు. ఈ మేరకు ఒక వీడియోను కూడా సోనూ షేర్ చేశారు. సౌకర్యాల లేమి ఎంత కృంగదీస్తుందో తెలుసు.. అందుకే షావోమితో జతకలిసానని ఆయన వెల్లడించారు. అందరి సహాకారంతో దేశంలోని వివిధ ప్రాంతాల్లో వేల స్మార్ట్ఫోన్లను విద్యార్థులకు అందిద్దామంటూ పిలుపు ఇచ్చారు. ఇందుకోసం ఎంఐ ఇండియా ఆధ్వర్యంలో తాను చేపట్టిన ‘శిక్షా హర్ హాత్’కోసం ప్రతిజ్ఞ పూనాలని సూచించారు. మీలో ఎవరిదగ్గరైనా, పూర్తిగా పనిచేస్తూ ఉండి.. మీకు ఉపయోగపడకుండా ఉన్న ఏదైనా స్మార్ట్ఫోన్ ఉంటే మాకు తెలపండి..మేం దాన్ని అర్హులైన విద్యార్థులకు అందజేస్తా మంటూ ఆయన తన వీడియో సందేశంలో వెల్లడించారు. ఈ వీడియోలో షావోమి గ్లోబల్ వైస్ప్రెసిడెంట్ మనోజ్కుమార్ జైన్ కూడా ఉన్నారు. పూర్తి కండిషన్లో ఉండి, డొనేట్ చేయాలనుకుంటున్న తమ పాత స్మార్ట్ఫోన్ సమాచారాన్ని యూజర్లు సమీపంలోని ఎంఐ కేంద్రంలో అందించాలని మనుకుమార్ విజ్ఞప్తి చేశారు. Aaj se koi bhi bacha apna online class nahi miss karega. This is our next mission... #ShikshaHarHaath Take the pledge with me here: https://t.co/f4Ev7vMc28@XiaomiIndia, @ManuKumarJain & @PrateikDas pic.twitter.com/w4XlMBqoMX — sonu sood (@SonuSood) January 25, 2021 -
‘స్మార్ట్ఫోన్ - ఆవు’ కథనంపై షావోమి స్పందన
సాక్షి, ముంబై: కరోనా వైరస్ సంక్షోభం కారణంగా ప్రాచుర్యంలోకి వచ్చిన పిల్లల ఆన్లైన్ చదువుల కోసం కుటుంబ పోషణకు ఆధారణమైన ఆవును అమ్ముకున్న వైనంపై ప్రముఖ మొబైల్ తయారీదారు షావోమి ఇండియా ఎండీ మను కుమార్ జైన్ స్పందించారు. హృదయాన్ని కదిలించే అంశమంటూ ఆ కుటుంబానికి సాయం అందించేందుకు జైన్ ముందుకొచ్చారు. వివరాలు షేర్ చేయాల్సిందిగా ట్వీట్ చేశారు.వారి పిల్లల విద్యాభ్యాసానికి సాయం చేస్తామని కూడా ప్రకటించారు. ఈ సందర్బంగా స్మార్ట్ఫోన్ నిత్యావసరమైన వస్తువుగా మారిపోయిందని వ్యాఖ్యానించారు. ఆన్లైన్ చదువులు, వర్క్ ఫ్రం హోం లాంటి వాటికి స్మార్ట్ఫోన్ చాలా అవసరమని ఆయన పేర్కొన్నారు. ఈ ట్వీట్కు నెటిజన్లు స్పందించడంతో షావోమి టీం బాధిత కుటుంబానికి నిత్యావసర సరుకులను అందించిందని జైన్ తెలిపారు. అలాగే బిడ్డల చదువుకు ఎలా సాయం చేయాలనేదానిపై చర్చిస్తున్నట్టు తెలిపారు. కాగా ఈ కథనంపై బాలీవుడ్ నటుడు సోనూ సూద్ కూడా స్పందించిన సంగతి తెలిసిందే. (ఆ కథనంపై చలించిన సోనూసూద్) After my morning tweet, many people helped us with the contact details of the man who sold his cow to buy a #smartphone. Happy to share that @XiaomiIndia team met him & we've donated ration for his family. We're discussing how best to support his kids' education. 🙏#Xiaomi ❤️ https://t.co/xzBXAuTAyw pic.twitter.com/7woqATnD1h — Manu Kumar Jain (@manukumarjain) July 24, 2020 -
షావోమి ల్యాప్టాప్ లాంచ్ : ఈ నెలలోనే
సాక్షి, ముంబై: చైనా స్మార్ట్ఫోన్ తయారీదారు షావోమి ఇక ల్యాప్ ట్యాప్ మార్కెట్లో దూసుకపోయేందుకు సిద్ధమవుతోంది. స్మార్ట్ఫోన్లు, స్మార్ట్ టీవీలను అందబాటు ధరల్లో తీసుకొచ్చి వినియోగదారులను విపరీతంగా ఆకర్షించిన షావోమి నోట్బుక్ను భారతదేశంలో లాంచ్ చేయనుంది. షావోమి రెడ్మిబుక్ పేరుతో దీన్ని ఈ నెల 11 వతేదీన ఆవిష్కరించనుంది. (రెడ్మీ 10 ఎక్స్ వచ్చేసింది..) ఎంఐ నోట్బుక్ జూన్ 11న భారతదేశంలో ప్రత్యేకంగా ప్రారంభించబోతున్నట్లు షావోమి ఇండియా చీఫ్ మను కుమార్ జైన్ సోమవారం ధృవీకరించారు. భారతీయ కస్టమర్లను దృష్టిలో ఉంచుకుని, ఇండియాలోనే తయారు చేసిన వీటిని తీసుకొస్తున్నట్లు ట్వీట్ చేశారు. తద్వారా ల్యాప్టాప్ మార్కెట్లో హెచ్పీ ఆపిల్, డెల్, లెనోవా వంటి టాప్ బ్రాండ్లతో కంపెనీ పోటీ పడాలని షావోమి చూస్తోంది. (మరో సంచలనం దిశగా షావోమి) ఈ ల్యాప్టాప్ ప్రత్యేకతలు, ఫీచర్ల వివరాలు ఇంకా అధికారికంగా వెల్లడి కానప్పటికీ రాబోయే షావోమి ల్యాప్టాప్ 1సీ ఫాస్ట్ ఛార్జింగ్ సొల్యూషన్కు మద్దతుతో, 35 నిమిషాల్లో 0-50 శాతం వరకూ రీఛార్జ్ చేయగలదని అంచనా. షావోమి రెడ్మి బుక్ ప్రత్యేకతలు 13.3-అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే (యాంటీ గ్లేర్ ) 1920 x 1080 పిక్సెల్స్ రిజల్యూషన్ 10వ జనరేషన్ ఇంటెల్ కోర్ 5, 7, ప్రాసెసర్లు ప్రధానంగా ఉండనున్నాయి. ఇక ధరల విషయానికి వస్తే.. రూ. 47,490, రూ. 54,800 ధర వద్ద ప్రారంభం కానున్నాయి. 📢 The brand new #MiNotebook will make its #Global #Debut in #India and will be: 🇮🇳 India 1st 🇮🇳 India exclusive 🇮🇳 Made for India Block the date: 𝐉𝐔𝐍𝐄 𝟏𝟏. No, it's not exactly what you're thinking 😇. RT 🔁 if you can't wait to see it.#Xiaomi ❤️️ pic.twitter.com/IKYkHnSQAk — Manu Kumar Jain (@manukumarjain) June 1, 2020
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
ఆర్టీసీ బస్సు– బైక్ ఢీ ●
వీడిన మహిళ హత్య కేసు మిస్టరీ
అంబేడ్కర్ కళాశాలలో దొడ్డమణి గోల్మాల్
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement