
ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్రెడ్డితో షావొమి బృందం
‘‘జగన్ గారూ!! నేటి యువతకు మీరో స్ఫూర్తి. రాష్ట్రానికి సంబంధించి మీ విజన్ను పూర్తిగా విన్నాక నాలో చాలా ఉత్తేజం కలిగింది. ఇదో అద్భుతమైన సమావేశం’’ అంటూ మొబైల్ దిగ్గజం షావొమి గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్, కంపెనీ ఇండియా ఎండీ మనుకుమార్ జైన్ మంగళవారం ట్వీట్ చేశారు. సోమవారం ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డిని కలిసి ఏపీలో మరో ప్లాంటు ఏర్పాటు చేయడానికి ఆసక్తి కనబరిచిన మను జైన్... ఆ భేటీ తాలూకు వివరాలు, ఫొటోలతో మంగళవారం కొన్ని ట్వీట్లు చేశారు. ‘‘ఆయన చాలా సింపుల్గా, సాదాసీదాగా కనిపిస్తారు. కానీ అద్భుతమైన ఆత్మవిశ్వాసం ఉంది. ఆయన్నుంచి మేం చాలా నేర్చుకున్నాం. ఉత్తేజం పొందాం’’ అంటూ మరో ట్వీట్ కూడా చేశారు. సోమవారం నాటి చర్చల్లో మేకిన్ ఇండియాలో భాగంగా పలు ఉపకరణాలు ఇక్కడే తయారు చెయ్యడానికి ఉన్న అవకాశాలను ముఖ్యమంత్రితో షావొమి బృందం చర్చించింది.
It was great meeting you Jagan @YSJagan Garu. 🙏
— #MiFan Manu Kumar Jain (@manukumarjain) July 23, 2019
You are an inspiration for today's youth. I am feeling motivated after listening to your vision for the state! #Xiaomi ❤️ #AndhraPradesh @AndhraPradeshCM https://t.co/3ea2y7OeNT