విజయనగరం ఆరోగ్యం: ఆకలి బాధలు, దొంగతనాలు, దోపిడీలు, నిరుద్యోగ సమస్య, ఆరోగ్య ఇబ్బందులు, పేదరికం, నివాస సమస్య..మంద ఎక్కువైతే మజ్జిగ పలచనైందన్న చందాన జనాభా పెరిగితే ఏర్పడే ఇబ్బందులు ఇవి. కుటుంబమైనా దేశమైనా అభివృద్ధి చెందాలంటే అది జనాభాపైనే అధారపడి ఉంటుంది. శు క్రవారం ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా సాక్షి అందిస్తున్న ప్రత్యేక కథనం. ప్రజల్లో జనాభా నియంత్రణపై అవగాహన పెరిగినప్పటికీ అది ఇంకా సరిపోనట్టు గోచరిస్తోంది. ప్రపంచ జనాభాలో మొదటి స్థానం చైనాది కాగా రెండో స్థానం భారతదేశానిది. ప్రస్తుత భారత దేశజనాభా 128 కోట్లుకాగా ఆంధ్రప్రదేశ్ జనాభా4.5 కోట్లు ఉంది. జిల్లా జనాభా ప్రస్తుతం 23,68,219. ఇందులో పురుషులు 11,62,136 కాగాస్త్రీలు 12,06,083మంది.
ఆరు ఏళ్ల లోపు బాలురు 1,23,311కాగా బాలికలు 1,18,357 మంది . 4954 మంది. జనాభా ఇలా పెరుగుతూ పోతుండడం వల్ల దేశంలో చాలామంది మూడు పూటలా కడుపు నిండా తినడానికి యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ప్రస్తుతం అన్నింటి కంటే నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉంది. ఒక ఉద్యోగం సాధించడానికి వందలాది మంది పోటీ పడుతున్నారు. జనాభా ఎక్కువగా ఉండడం వల్ల దేశంలోనూ, జిల్లాలోనూ ప్రజలకు తాగడానికి నీరు కూడా పూర్తిస్థాయిలో అందకపోవడం వల్ల నీటి యుద్ధాలు కూడా తప్పని పరిస్థితి కనిపిస్తోంది. 1987లో తీవ్రమైన ఆహార కొరత, అంటువ్యాధులు, నిరుద్యోగం పెరిగిపోవడంతో జనాభాను నియంత్రించాలనే ఉద్దేశంతో ఆ ఏడాది జూలై 11వ తేదీ నుంచి ప్రపంచ జనాభా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఏటా జనాభా పెరుగుదల గురించి ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు.
జనాభా తక్కువగా ఉంటే..
జనాభా తక్కువైతే జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి. మంచి ఆహారం దొరుకుతుంది. మంచి ఇళ్లు కట్టుకోగలరు. ఉద్యోగం అందరికీ దొరుకుతుంది. పేదరికం తగ్గి ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా ప్రశాంతంగా జీవించగలుగుతారు.
అవగాహన చేపడుతున్నాం
జనాభా నియంత్రణకోసం అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం. బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలు, ఆడపిల్ల 21 సంవత్సరాలు, పురుషుడు 25 సంవత్సరాలకు వివాహం చేసుకునేలా అవగాహన కల్పిస్తున్నాం. అంతేకాకుండా బిడ్డకు, బిడ్డకు మధ్య కనీసం ఐదు సంవత్సరాలు ఎడం పాటించేలా కుటుంబ సంక్షేమ తాత్కాలిక పద్ధతుల గురించి అవగాహన కల్పిస్తున్నాం. బడిలో బిడ్డ ఒడిలో బిడ్డ అనే నినాదంతో పనిచేస్తున్నాం. ప్రతి ఏడాదీ కళాశాలల్లోనూ సీహెచ్సీ స్థాయిల్లో జనాభా పెరుగు దల వల్ల కలిగే అనర్థాల గురించి వివరిస్తున్నాం. యు.స్వరాజ్యలక్ష్మి, డీఎంహెచ్ఓ
జనం పెరిగితే రణమే
Published Fri, Jul 11 2014 1:53 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఇదేం ఫ్యామిలీ రా సామీ! ఏకంగా కోబ్రాకే నేరుగా..!
వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
ఎప్పుడూ పనీపనీ.. మాతో ఉండవా? అని నా కుమారుడు నిలదీశాడు
గ్రీన్ డ్రెస్లో కరిష్మా కపూర్.. జ్యువెలరీ షోరూంలో సందడి చేసిన భామ (ఫోటోలు)
రిజర్వేషన్లను తొలగించే కుట్ర జరుగుతోంది: నిర్మల్ సభలో రాహుల్
చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు
తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..
Beauty Tips: ఈ డివైస్ని వాడారో.. మీ ముఖం చక్కటి ఆకృతిలోకి..
హ్యాట్రిక్ కొట్టిన ఆర్సీబీ.. ఆ జట్లకు హెచ్చరిక
‘బినామీలు బయటపడతారు.. అదే చంద్రబాబు భయం’
తప్పక చదవండి
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- బాబుకు బొమ్మ కనిపిస్తోంది: విజయసాయిరెడ్డి సెటైర్లు
- ఓటమి భయంలో కొడుకు.. డబ్బు మూటలతో తండ్రి!
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- ఐపీఎల్లో ఇవాళ (మే 5) డబుల్ ధమాకా
- వరుస ఫ్లాప్స్.. పూజా హెగ్డేకు మరో ఛాన్స్
- నిజ్జర్ కేసులో అరెస్ట్.. భారత్కు సంబంధంలేదన్న జయశంకర్
- తోడేళ్ళను తరిమే రోజు!
Advertisement