ఆర్టీసీ బస్సు ఢీకొని మహిళ మృతి | women died in road accident | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ బస్సు ఢీకొని మహిళ మృతి

Jan 25 2016 2:10 PM | Updated on Sep 3 2017 4:18 PM

ఆర్టీసీ బస్సు ఢీకొని బైక్‌ పై వెళుతున్న ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది.

ముమ్మిడివరం: ఆర్టీసీ బస్సు ఢీకొని బైక్‌ పై వెళుతున్న ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరంలో ఈ ఘటన జరిగింది. ఐ.పోలవరం మండలం ఎదుర్లంకకు చెందిన దంపతులు సోమవారం బైక్‌పై కాట్రేనికోన వెళుతున్నారు. ముమ్మిడివరంలో వీరి బైక్‌ను అమలాపురం డిపోకు చెందిన బస్సు వెనుక నుంచి ఢీకొంది. బైక్‌పై వెనుక కూర్చున్న బీవీ మహాలక్ష్మి తీవ్ర గాయాలతో మృతి చెందింది. 
 

Advertisement
 
Advertisement
Advertisement